బ్రేక్ తర్వాత చూడండి అంటూ తెలుగు టివి చానల్సలో వచ్చే వార్తల్లాగా కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ.. మళ్లీ ఆ దెబ్బ మీద మరో దెబ్బ ఇలా తగుతూనే ఉన్నాయి. విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టిలో కీలక పాత్రలు పోషించిన నాయకులు ఎవరు ఇప్పుడు పార్టిలో లేరు.పార్టి అధ్యక్షులుగా పని చేసిన నేతలు పార్టి తరుపున ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు కాంగ్రెస్ ను వీడారు.పీసీసీ అధ్యక్షులుగా పని చేసిన ముగ్గురు నేతలు పార్టీని వీడారు.2013లోనే కే.కేశవరావు కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.గత నెలలో బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు.
Also Read: కాంగ్రెస్ కు చెయ్యస్తున్న నేతలు.. త్వరలోనే కాంగ్రెస్ ఖాళీ
లేటేస్ట్ గా డి. శ్రీనివాస్ గులాబీ గూటికి చేరనున్నారు. ఒకప్పుడు గాంధీభవన్ లో వారిదే హవా.ఆ ముగ్గురు లేకుండా కీలక భేటీలు జరిగేవి కావు.నేడు వారే కాదు..వారి అనుచరులు లేకుండానే సభలు,సమావేశాలు జరపాల్సిన పరిస్థితి. పీసీసీ అధ్యక్షులుగా పని చేసిన చివరి ముగ్గురే కాదు..చివరి సి.ఎంలు ఇప్పుడా పార్టీ లో లేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సి.ఎంగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి గత ఎన్నికల్లో సోంత కుంపటి పెట్టుకుని ఫెయిల్ అయ్యారు.ఇక కిరణ్ కుమార్ రెడ్డికి ముందు సి.ఎంగా చేసిన రోశయ్య ఇప్పుడు కాంగ్రెస్ లో లేరు. తమిళనాడు గవర్నర్ గా ఉన్నారు.విషయం ఏదైనా ఆంధ్రప్రదేశ్ కు వరుసగా పని చేసిన ఇద్దరు సి.ఎంలు,ముగ్గురు పిసిసి అధ్యక్షులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేకపోవడం ఆశ్చర్యమే.
Also Read: అబ్బో కాంగ్రెస్ పొడిచింది
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more