టీడీపీ పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు తెరాస చేసిన ప్రయత్నాలు వారినే ఇబ్బందుల్లో పడేసినట్లు కనిపిస్తోంది. ‘ఓటుకు నోటు’, ‘ఫోన్ ట్యాపింగ్’ వంటి వ్యవహారాలతో టీడీపీని ముచ్చెమటలు పట్టిద్దామని భావించిన తెలంగాణ ప్రభుత్వం స్వయం చెమటల సరస్సులో మునిగిపోయినట్లు చెప్పుకుంటున్నారు. ఆ రెండు వివాదాలు తెరమీదకి వచ్చిన నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ను ముప్పుతిప్పలు పెట్టేందుకు ఏపీ సర్కార్ తనదైన రీతిలో పావులు కదుపుతోంది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంపై గవర్నర్ కి అధికారం అప్పగించాలని ఉద్దేశంతో కేంద్రప్రభుత్వంతో ‘సెక్షన్-8’ అమలుపై మంతనాలు జరిపింది. ఇప్పుడు ఈ విషయమై విస్రృత చర్చ జరుగుతోంది.
ఓవైపు సెక్షన్-8 అమలు కోసం ఏపీ సర్కార్ పట్టుబడుతుండగా.. దానిని అమలు చేస్తే సహించేది లేదని తెలంగాణ సర్కార్ చెబుతోంది. ఇప్పటికే ఈ సెక్షన్-8 అమలుపై కేంద్రం సానుకూలంగా వుండటంతో కేసీఆర్ సర్కార్ అప్రమత్తమైంది. ఈ సెక్షన్-8ని అమలు చేస్తే ఎట్టిపరిస్థితుల్లోనైనా ప్రతిఘటించి తీరుతామని టీఆర్ఎస్ ఇదివరకే ప్రకటించింది. ఇప్పుడు కేసీఆర్ దీనిని వ్యతిరేకంగా తనదైన శైలిలో ముందుకు నడుస్తున్నట్లు సమాచారం! ఈ సెక్షన్-8కు వ్యతిరేకంగా ఆయన జాతీయ స్థాయిలో మద్దతు కూడగడుతున్నారని రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఆయన జాతీయ పార్టీలకు చెందిన కొందరి నేతలతో మంతనాలు కూడా జరిపారట.. ఈ సెక్షన్-8 వ్యతిరేకంగా తమతోపాటు మద్దతు తెలిపాల్సిందిగా ఆయన కోరారని సమాచారం!
అవసరమైతే సెక్షన్-8కు వ్యతిరేకంగా దీక్షకు దిగేందుకు కూడా తాను సిద్ధంగానే వున్నానని తన సన్నిహితులతో కేసీఆర్ పేర్కొన్నట్లు ఒకటే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సమర‘దీక్ష’ను హైదరాబాదులో చేపట్టాలా లేకా ఢిల్లీలోనా? అనే విషయంపై తన పార్టీ నేతలతో కేసీఆర్ చర్చలు కొనసాగిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే.. సెక్షన్-8కు వ్యతిరేకంగా కేసీఆర్ దీక్షకు దిగుతారా? లేదా? అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే! ఏదేమైనా.. సెక్షన్-8 తెలంగాణ సర్కార్ ను బాగానే ముప్పుతిప్పలు పెట్టిస్తోందని చెప్పుకుంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more