నేపాల్ సంభవించిన భూప్రళయం భూతలస్వర్గం దేశాన్ని అతలాకుతలం చేసేంత శక్తివంతమైనది.. అంతేకాకుండా 9000 మంది పౌరుల ప్రాణాలను బలి తీసుకుందని కూడా తెలుసు. అయితే ఏకంగా ప్రపంచంలోనే అత్యంత ఎతైన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్టును కూడా కదిపిందని తాజా అధ్యయనాలలో వెల్లడైంది. నేపాల్ భూకంపం ధాటికి పర్వత శిఖరం ఎత్తు చెక్కు చెదరలేని ఇప్పటికే విదేశీ సంస్థలు అధ్యయనాలు చేయగా, తాజాగా వెలుగులోకి వచ్చిన చైనా అధ్యయనాలు పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్టును నేపాల్ భూకంపం ఏకంగా మూడు సెంటీమీటర్లు జరిపినట్లు వెల్లడించాయి.
గత ఏప్రిల్ 25 తోపాటు మే 12న 7.8, 7.3 తీవ్రత రెక్టార్ స్కేలుపై నమోదైన నేపాల్ భూకంపాలుతో ఆ తదనంతరం మౌంట్ ఎవరెస్టులో వచ్చిన మార్పులపై చైనాలోని జియోలాజికల్ సంస్థ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో ఎవరెస్టు.. నైరుతి
దిక్కుకు 1.2 సెంటీ మీటర్లు జరిగినట్లు తెలిసిందని పేర్కొంది. గత 10 ఏళ్లలో ఈశాన్య దిశగా ఏడాదికి సగటున నాలుగు సెంటీమీటర్ల మేర జరిగిన పర్వతం.. అదే స్థాయిలో ఏడాదికి సగటున మూడు సెంటీమీటర్ల పోడువుకు కూడా విస్తరించించని అధ్యయనాలు వెల్లడించాచి. అయితే నేపాల్ భూకంపంతో పర్వతం మూడు సెంటీమీటర్లు మేర నైరుతి దిశగా కదిలిందని ఆ సంస్థ తెలిపింది.
ఈ పర్వత శ్రేణులలో భూభాగంలో మార్పులు తూర్పు, దక్షిణ ఏసియా దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, స్థానిక వాతావరణంతో పాటు ఎకాలజీ, పర్యావరణాలపై కూడా మౌంట్ ఎవరెస్టు పర్వత శ్రేణులలో మార్పలు ప్రభావాన్ని చూపుతాయని చైనా జియోలాజికల్ సంస్థ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మౌంట్ ఎవరెస్టుపై అధ్యయనం కోసం 2005లో శాటిలైట్ మానిటరింగ్ వ్యవస్థను 2005లో ఏర్పాటు చేసిన చైనా.. నేపాల్ భూప్రళయం తరువాత అధ్యయనాలను ప్రారంభించి.. వాటి ఫలితాలను ఇవాళ వెల్లడించింది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more