ప్రస్తుతకాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం ఏమేర వుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దపెద్ద ప్రైవేట్ కంపెనీలు సైతం తమ కార్యకలాపాలు నిర్వహించుకోవడంలో వీటిని నిత్యం ఉపయోగిస్తుంటారు. ఇంతటి నిత్యవసరమైన ఈ స్మార్ట్ ఫోన్ లో ఒక్క చిన్న లోపం వుంటుంది. అదే ‘బ్యాటరీ బ్యాకప్’! స్మార్ట్ ఫోన్ నిత్యవసరం కాబట్టి.. దాని బ్యాటరీ బ్యాకప్ కోసం పవర్ బ్యాంకును లేదా చార్జర్ ను చేత్తో పట్టుకుని ఖచ్చితంగా తిరగాల్సిందే! అలాగే.. ‘ర్యామ్’ పనితీరు కూడా కొన్ని ఫోన్లలో అంత సమర్థవంతంగా వుండదు. కొన్నిసార్లు ఫోన్ ఆపరేటింగ్ చేస్తుండగానే.. హ్యాంగ్ అయిపోవడం జరుగుతుంది. అయితే.. ఇకనుంచి ఇటువంటి సమస్యలు లేకుండా ‘గూగుల్’ సరికొత్త సాంకేతికతను త్వరలో పరిచయం చేయనుంది.
బ్యాటరీ బ్యాకప్, ర్యామ్ వాడకాలపై దృష్టి సారించిన గూగుల్.. ఆ రెండు సమస్యలను అధిగమించేలా సరికొత్త సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. త్వరలో జరిగే ‘గూగుల్ ఐఓ-2015’వార్షిక డెవలపర్ల సదస్సులో ఆ సాంకేతికతను తొలిసారి పరిచయం చేయనుంది. ‘గూగుల్ ఆండ్రాయిడ్ ఎం’ పేరిట డెవలపర్ ప్రివ్యూ ఇవ్వాలని ఆ సంస్థ ఇప్పటికే నిర్ణయించింది. ఆండ్రాయిడ్ ఎల్, తదుపరి దశలో లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్ గా మారినట్లు.. ఈ ఆండ్రాయిడ్ ఎంకు ‘మార్ష్ మాలో’ అని పేరు ఖరారవుతుందని తెలుస్తోంది. అక్టోబర్ లో విడుదలయ్యే నెక్సస్ స్మార్ట్ ఫోన్లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ వుంటుందని గూగుల్ వర్గాలు చెబుతున్నాయి.
ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. స్మోర్ట్ ఫోన్లో ఎన్నడూ చూడలేని బ్యాటరీ బ్యాకప్! అలాగే.. ర్యామ్ పనితీరు సమర్థవంతంగా వుంటుందని తెలుస్తోంది. ఇక వీటితోపాటు ఫింగర్ ప్రింట్ ను గుర్తించి లాక్ ఓపెన్ అయ్యేలా కొత్త యాప్, సరికొత్త వాయిస్ యాక్సెస్, మరింత అభివృద్ధి చేసిన గూగుల్ వాయిస్ సెర్చ్, కొత్త క్రోమ్ కాస్ట్, ఫోటోస్ తదితర యాప్ లను గూగుల్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇన్ని సౌకర్యాలతో కూడిన ఈ నెక్సస్ స్మార్ట్ ఫోన్ ధర కాస్త ఎక్కువగానే వుండొచ్చని విశ్లేషకుల అభిప్రాయం!
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more