శుభముహూర్తం కుదిరింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఐదవ పర్యాయం మళ్లీ బాధ్యతలను చేపట్టనున్నారు. తమిళనాట ప్రజలు, అన్నా డిఎంకే కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు, నేతలు ఎప్పడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న శుభతరుణం రానే వచ్చింది. ఇక మరికోన్ని గంటల వ్యవధిలో తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణ స్వీకరాం చేయనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేసేందుకు ముహుర్తాన్ని కూడా ఖరారు చేశారు.
దాదాపు 8 నెలల తర్వాత తొలిసారిగా ప్రజలకు దర్శనమిచ్చిన 'అమ్మ'.. రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్యను కలిసి, తన మంత్రివర్గంలో ఉండబోయే మంత్రుల జాబితాను ఆయనకు సమర్పించారు. బెంగుళూరు అగ్రహర పరప్పనా ప్రత్యక కోర్టు తీర్పుతో కటకటావెనక్కి వెళ్లిన జయలలిత.. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినప్పటి నుంచి పోయెస్ గార్డన్స్ కే పరిమితమైంది. సుదీర్ఘ కాలం తర్వాత బయటకు వచ్చిన ఆమె.. ముందుగా ఎంజీ రామచంద్రన్ విగ్రహం వద్ద నివాళులర్పించి.. ఆ తర్వాత గవర్నర్ నివాసమైన రాజ్భవన్కు వెళ్లారు. అక్కడ గవర్నర్ రోశయ్యను కలిసి తనకు మద్దత్తునిస్తున్న జాబితాను ఆయనకు సమర్పించారు.
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా అన్నా డీఎంకే అధినేత్రి జయలలితను ఆ రాష్ట్ర గవర్నర్ కే రోశయ్య ఆహ్వానించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం రాజీనామాను రోశయ్య ఆమోదించినట్టు వెల్లడించింది. అంతకుముందు ఇవాళ ఉదయం అన్నా డీఎంకే శాసనసభ పక్ష నాయకురాలిగా జయలలిత ఎన్నికయ్యారు. జయలలిత బయటకు రాగానే ఒక్కసారిగా అభిమానులంతా.. 'అమ్మ తిరిగొచ్చింది' అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జయలలితకు శుభాకాంక్షలు తెలియజేశారు. జయలలిత సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎంపీ కవితకు ఆహ్వానం పంపారు. కవిత రేపు ఉదయం చెన్నై వెళ్లనున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more