రాష్ట్ర పునర్విభజన అనంతరం నవ్యాంధ్ర ప్రదేశ్ లో తొలిసారి జరిగిన పదో తరగతి పరీక్ష ఫలితాలను మంత్రి ఘంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. రోటిన్ ను కోనసాగిస్తూ నవ్యాంధ్ర పరీక్షఃల ఫలితాలలోనూ అమ్మాయిలు తమ అద్భుత ప్రతిభను కనబర్చి పైచేయి సాధించారు. తొలిసారి ఎస్ఎస్సీ పరీక్షల ఫలితాలో మొత్తంగా 91.42 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. ఇవి గతం కన్నా 0.26 శాతం ఉత్తీర్ణత అధికంగా నమోదైందని మంత్రి వెల్లడించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సటీలోని వైవీఎస్ మూర్తి అడిటోరియంలో మంత్రి గంటా పదోతరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసిన అనంతరం వాటి వివరాలను తెలిపారు.
మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షలకు మొత్తం 6 లక్షల 44 వేల 961 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో రెగ్యూలర్ విద్యార్థులు 5 లక్షల 54 వేల 536 మంది ఉత్తీర్ణత సాధించారు. అయితే అబ్బయిల కన్నా పైచేయి సాధించిన బాలికలు 0.59శాతం అధికంగా ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 91.71 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 91.15శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 3645 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణ నమోదైందని మంత్రి వెల్లడించారు. అయితే రెండు పాఠశాలల్లో మాత్రం సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు.
నవవ్యాంధ్ర లో తొలి పదో తరగతి పరీక్ష ఫలితాల 98.54 శాతం ఉత్తీర్ణతలో కడప జిల్లాకు మొదటి స్థానంలో నిలువగా, 71.29 శాతంతో చిత్తూరు జిల్లా చివరిస్థానంలో నిలిచింది. ఎయిడెట్ పాఠశాలల్లో 85.2 శాతం ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. జిల్లా పరిషత్ పాఠశాలల్లో 89 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. జూన్ 18 నుంచి జులై 1 వరకు పదోతరగతి అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more