అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అంటే ప్రపంచానికి తెలుసు. ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నా ఒక్క అమెరికాకు మాత్రమే పెద్దన్న హోదా దక్కింది. మరి అలాంటి అమెరికాకు అధ్యక్షుడు అంటే ప్రపంచంలో ఎంతో ప్రభావశీల వ్యక్తి. కానీ అలాంటి వ్యక్తి ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ జపం చేస్తున్నారు. ఒకప్పుడు భారత్ అంటే ఆసియాలో ఓ దేశం.. జనాభా ఎక్కువగా ఉన్న దేశం అన్న ఆలోచన నుండి ఇప్పుడు అమెరికా బయటికి వచ్చింది. భారత్ అంటే ప్రపంచంలో చాలా గొప్పదేశం అన్నంతలా బిల్డప్ ఇస్తోంది. అంతలా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మారడానికి కారణం ఏంటీ.? మోదీ మానియాకు నిజంగా ఫిదా అయ్యారా..? లేదా పైపైకి అలా అనిపించేలా చేస్తున్నారా..? అన్న ప్రశ్నలకు సమాధానాలు కింద ఉన్నాయి.
అమెరికా నుండి భారత్ ఎప్పుడూ సహాయం కోసం అర్థిస్తూ ఉండేది. అయితే అప్పుడప్పుడు బారత్ చేసిన ప్రపోజల్స్ ను రిజక్ట్ కూడా చేస్తూ ఉండేది. మరి అలాంటిది ఇప్పుడు మాత్రం ఇండియాకు ఇంత ప్రిపరెన్స్ ఎందుకు వస్తోందీ అంటే.. పరిస్థితులను బట్టి అమెరికా తన స్టైల్ ను మారుస్తూ ఉంటుంది కాబట్టి. గత కొంత కాలంగా తిరుగులేని ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది కాబట్టి భారత్ తో ఆచితూచి ఉండాలని అమెరికా వ్యూహం. అలాగే భారత ప్రధాని గత కొంత కాలంగా చేస్తున్న విదేశీ పర్యటనలు, అతడికి వస్తున్న ఫాలోయింగ్ తో అమెరికా భయపడిపోతోంది. అందుకే కుదిరితే మోదీ జపం చేస్తోంది. తాజాగా మోదీ గురించి టైమ్స్ మ్యాగజీన్ లోఇంట్రడక్షన్ కూడా రాశారు. చైనాతో జరిగిన ఒప్పందాలు అమెరికాను భయపెడుతున్నాయి. అందుకే ముందు జాగ్రత్తగా బారత్ జపం చేస్తోంది అమెరికా.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more