భూమిలేని నిరుపేద దళిత కుటుంబాలను రైతులుగా నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన భూపంపిణీ పథకం రెండోదశ పనులు వేగంగా జరుగుతున్నాయి. భూమిలేని ప్రతి నిరుపేద దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇవ్వటంతోపాటు దానికి సాగునీటి సౌకర్యం కూడా కల్పించే ఈ కార్యక్రమం కింద మొదటి దశలో ఇప్పటికే 2400 ఎకరాలకు పైచిలుకు భూమిని హైదరాబాద్ మినహా తొమ్మిది జిల్లాల్లో దాదాపు వెయ్యిమంది లబ్ధిదారులకు పంచారు. రెండోదశలో పంచేందుకు నాలుగువేల ఎకరాల భూమిని అధికారులు సిద్ధంచేశారు.
మొదటిదశ పంపిణీ సమయంలో అధికార యంత్రాంగం మొత్తం ఆసరా, సమగ్ర కుటుంబ సర్వే, ఆహార భద్రత కార్డులపై దృష్టి పెట్టడంతో ఈ పథకం కొంత నెమ్మదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నెలలోపే ఈ పథకం కోసం నాలుగువేల ఎకరాల భూమిని కొనుగోలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలు మినహా మిగిలిన 7 జిల్లాల్లో రైతులతో అధికారులు విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. మే ఒకటో తేదీనాటికి నాలుగువేల ఎకరాల పైచిలుకు భూ యజమానులతో చర్చించారు. భూమి కొనుగోలుకు ముందు ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూసార పరీక్ష, భూగర్భజల పరీక్ష, న్యాయపరమైన అంశాలు, ఇతరాలను పరిశీలిస్తున్నారు. క్లియర్ టైటిల్ ఉన్న భూముల కొనుగోలుకు సుముఖత వ్యక్తంచేశారు. భూసార, భూగర్భ జల పరీక్షల నివేదికలు రాగానే మిగిలిన భూములను కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more