తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన ఎంఎస్ విద్యార్థి ఒకరు విదేశాల్లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాల్లో పాల్గొంటూ మృతి చెందిన విషయం వెలుగులోకి వచ్చింది. నిఘావర్గాల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ విద్యార్థి కుటుంబీకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాలకు చెందిన హఫీజ్ అనే విద్యార్థి ఎంఎస్ చదివేందుకు మూడేండ్ల క్రితం అమెరికా వెళ్లాడు. అక్కడ ఆన్లైన్, సోషల్ మీడియా ద్వారా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఉగ్రవాదులతో సంబంధాలు పెంచుకున్నాడు. తర్వాత పలు దేశాల్లో ఆ సంస్థ కార్యకలాపాల్లో నేరుగా పాల్గొని ఆయుధాలతో కాల్పులకు తెగబడ్డాడని నిఘా వర్గాలకు సమాచారం వచ్చింది. ఈ విషయాలేవీ కుటుంబీకులకు, బంధువులు, స్నేహితులకు తెలియదు.
నాలుగునెలల క్రితం హఫీజ్ స్వస్థలం మంచిర్యాలకు వచ్చాడు. తల్లిదండ్రుల కోరిక మేరకు ఒక అమ్మాయితో నిశ్చితార్థం జరిగిన తర్వాత అమెరికా వెళ్లిపోయాడు. మార్చి 15న తల్లిదండ్రులకు ఐఎస్ఐఎస్ సంస్థ నుంచి ఫోన్ వచ్చింది. కాల్పులు, ఎదురుకాల్పుల్లో హఫీజ్ చనిపోయాడని వారు సమాచారం అందించారు. అయితే ఈ విషయాన్ని కుటుంబీకులు బయటకు పొక్కనివ్వలేదు. చదువుకునేందుకు వెళ్లిన కొడుకు ఉగ్రవాద సంస్థలో చేరుతాడని అనుకోలేదని వారు చెప్తున్నా నిఘా వర్గాలు మాత్రం హఫీజ్ ఐఎస్ఐఎస్లో చేరిన విషయం కుటుంబీకులకు తెలుసని అంటున్నాయి.
హఫీజ్ మరణించిన విషయం గప్చుప్గా ఉంటుందని కుటుంబీకులు భావించినా నిఘా వర్గాలు పసిగట్టాయి. కౌంటర్ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెన్స్ బ్యూరో, దర్యాప్తు సంస్థలు, నిత్యం వివిధ దేశాల్లోని దర్యాప్తు సంస్థలతో టచ్లో ఉండే నిఘావర్గాల సమాచార విశ్లేషణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రెండురోజుల క్రితం ఈ విషయాన్ని రాష్ట్ర నిఘావర్గాలకు తెలియ చేయడంతో వారు హుటాహుటిన హఫీజ్ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. హఫీజ్ ఐఎస్ఐఎస్ సానుభూతిపరుడిగా ఎప్పుడు మారాడు? ఏయే దేశాల్లో కార్యకలాపాలు సాగించాడన్న సమాచారాన్ని సేకరిస్తున్నారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more