రైలు ప్రయాణికులకు శుభవార్త. ఇకపై గంటల కోద్ది సమాయాన్ని టిక్కెట్ కోసం పెద్ద క్యూ లలో నిలబడి.. తంటాలు పడాల్సిన పనిలేదు. అది మాకు తెలుసు.. కానీ అవన్నీ రిజర్వేషన్ పోందే టిక్కట్లకే కదా అంటున్నారా..? అయితే మీరు పోరబడినట్లే.. ఇకపై రిజర్వేషన్ లేని కేటగిరీ టికెట్లను కూడా మీ మొబైల్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే వెసులబాటును కేంద్ర రైల్వేశాఖ తీసుకోచ్చింది. అన్రిజర్వ్డ్ కేటగిరీ టికెట్లను పొందేందుకు రైల్వే శాఖ సరికొత్త మొబైల్ అప్లికేషన్ను బుధవారం ప్రారంభించింది. ఇక దీంతో మీరు ఎక్కాల్సిన రైలు పట్టుకున్నాక ట్రైన్ లో కూర్చున్న తరువాతైనా మీ టిక్కెట్టును మీ మొబైల్ నుంచి పోందవచ్చు.
ముంబైలోని సబర్బన్ రైల్వే సెక్టారులో పైలెట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు చేతుల మీదగా ప్రారంభించారు. ఈ యాప్తో అన్రిజర్వ్డ్ రైలు టికెట్ కోసం ప్రయాణికులు ఇక గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పటికే ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా ముందుగా టిక్కెట్లు రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే అప్పటికప్పుడు ప్రయాణాలకు సిద్ధమైన ప్రయాణీకులు ఈ కొత్త మొబైల్ యాప్ ద్వారా సులభంగా టిక్కెట్లను పొందవచ్చు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాగిత రహిత టికెట్ సదుపాయం కోసం ఈ అప్లికేషన్ను రూపొందించినట్లు రైల్వే శాఖ అధికాలు తెలిపారు. రైలులో ఎక్కిన తర్వాత టీసీలకు మొబైల్లోని ఐడీ నెంబర్ చూసిప్తే సరిపోతుంది. స్మార్ట్ఫోన్లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి రైల్వే యాప్ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. రైల్వే ఇ-వాలెట్ కోసం వినియోగదారుడికి రిజిస్ట్రేషన్ ఐడీ నంబరు వస్తుంది. వినియోగదారుడు రిజిస్ట్రేషన్ చేయించుకొన్న తర్వాత వారి వివరాలు ఇ-వ్యాలెట్లో నమోదవుతాయి. టికెట్ల కొనుగోలు సొమ్మును ఇ-వాలెట్ మొబైల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఆన్లైన్లో చెల్లించవచ్చు. ఇక జర్నీ హ్యాపీ కదండీ..
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more