దేశ ప్రథమ పౌరుడు, దేశాధ్యక్షుడు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను తోసిరాజీ, ఫోటో దిగి.. దాంతోనే తన టార్గెట్ చేరిన కిలాడీ లేడి.. తన భర్తను కూడా బూరిడీ కోట్టించింది. నిజానికి శిక్షణలో ఉన్న ఐఏఎస్లకు కూడా సాధ్యంకాని పనులన్నీ దర్జాగా, ఎలాంటి బెరుకూ లేకుండా కానిచ్చేసింది నకిలీ ఐఏఎస్ ట్రైనీ రూబీ చౌదరి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. గత ఏడాది ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి ఐఏఎస్ అకాడమీకి వెళ్లిన సందర్భంలో ఆయనతో కలిసి రూబీ దిగిన ఫొటో పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురిచేశాయి.
సరిగ్గా వీరేందర్ మాలిక్ కూడా అదే నమ్మికతో రూబీ చౌదరిని పెళ్లిచేసుకున్నాడు. చివరికి ఆమె భర్త వీరేందర్ మాలిక్ కూడా అదే నమ్మి పెళ్లి చేసుకున్నాక అలసు విషయం తెలియడంతో.. అందరిలాగే అవాక్కయ్యాడు. 'రూబీ ఐఏఎస్ ట్రైనీ అని అబద్ధాలు చెప్పి తమ కుటుంబాన్ని నమ్మించారని. అందుకే ఆమెను పెళ్లాడానన్నారు. మోసం బయటపడ్డాక అన్ని విషయాలూ తనకు తెలుసని రూబీ చెప్పడం దారుణమన్నారు. ఇలాంటి వాళ్లని చట్టం కఠినంగా శిక్షించాలి. ఈ కేసులో పూర్తిస్థాయి నిజానిజాలు వెలికితాయాలని పోలీసులను కోరారు.
శుక్రవారం రాత్రి రూబీని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని ముజఫర్నగర్ పోలీసు ఉన్నతాధికారులు శనివారం ప్రకటించారు. లాల్ బహదూర్ శాస్త్రి ఐఏఎస్ అకాడమీ అడ్మినిస్ట్రేటివ్ అధికారి ముస్సోరీ పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదుమేరకు రూబీని అదుపులోకి తసుకుంటున్నట్లు తెలిపారు. అమె బస చేసిన గదిని క్షణ్నంగా తనిఖీ చేసిన పోలీసులు, ఆమె కుటుంబ సభ్యుల వాగ్మూలాన్ని కూడా నమోదు చేసుకున్నారు. అకాడమీలో ప్రవేశంకోసం డిప్యూటీ డైరెక్టర్ సౌరభ్ జైన్ కు రూ.5 లక్షలు లంచంగా ఇచ్కచినట్లు రూబీ పేర్కొనడాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారం వెలుగుచూడటంతో డిప్యూటీ డైరెక్టర్ జైన్ ను ఏ క్షణమైన తొలిగించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more