బిజెపి అగ్రనేత కాంగ్రెస్ నేతలకు మంచి అవకాశాన్ని ఇచ్చారు. అదేంటి కాంగ్రెస్ కు బద్ద శత్రువైన అడ్వానీ కాంగ్రెస్ కు అవకాశం ఎలా ఇస్తారు అని అనుకుంటున్నారా.. అవకాశం అంటే ప్రత్యక్షంగా కాదు కానీ పరోక్షంగా మాత్రం అవకాశం కల్పించారు. బెంగళూరులో జరుగుతున్న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ కురువృద్ధుడు అడ్వానీ మౌనంగా ఉన్నారు. పార్టీ అధినేత అమిత్ షా మాట్లాడాలని ఎంతగా కోరినా అతను మాత్రం మాట్లాడలేదు. దాంతో దీన్నే కాంగ్రెస్ నాయకులు తమ ఆయుధంగా వాడుకుంటున్నారు. రాహుల్ గాంధీ గురించి వెతకమని సలహా ఇచ్చిన బిజెపికి కాంగ్రెస్ వాళ్లు తిరిగి వారికే సలహా ఇచ్చారు. ఇంతకీ ఆ సలహా ఏంటని అనుకుంటున్నారా..
రాహుల్ గాంధీ కనిపించడం లేదని ,ఆయనను వెతుక్కోండని వ్యాఖ్యానిస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులు ముందుగా తమ పార్టీ సీనియర్ నేతలు అద్వాని, మురళీమనోహర్ జోషిలను గౌరవించాలని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. దానికి తగినట్లుగానే అద్వాని తాజాగా అలక పూనారని వార్తలు వస్తున్నాయి. బెంగళూరులోని బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలలో అద్వాని మాట్లాడాలని బిజెపి అద్యక్షుడు అమిత్ షా కోరినా ఆయన మాట్లాడలేదని సమాచారం వస్తోంది.అయితే సమావేశాలలో వేదికపై ముందుగా అమిత్ షా జ్యోతి వెలిగించిన తర్వాత అద్వానిని ముందుకు పిలిచి జ్యోతి వెలిగించాలని కోరడం ,ఆయన ఆ పని పూర్తి చేయడం జరిగింది. కాని అద్వాని, మోడీల మధ్య పెద్దగా మాటల పలకరింపులు లేవని అంటున్నారు.80 ఏళ్లు దాటినవారు పార్లమెంటరీ బోర్డులో ఉండరాదని మోడీ గతంలో నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి సీనియర్ లలో అసంతృప్తి ఉందని అంటున్నారు.మొత్తానికి అమిత్ షా కాంగ్రెస్ వారికి రాహుల్ ను వెతకమని సలహాను ఎలాగూ పాటించలేదు మరి కాంగ్రెస్ వారు అన్నట్లు అడ్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి సీనియర్లను గౌరవిస్తారా అన్నది ప్రశ్న.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more