పొగత్రాగడం ఆరోగ్యానికి హానికరం..క్యాన్సర్ కు కూడా కారణం - అని సిగరెట్ బాక్స్ లపై వచ్చే వార్నింగ్ సైజ్ ను మరింత పెంచాలని ప్రధాని మోదీ కేంద్ర ఆరోగ్యమంత్రి జెపి నడ్డాకు సూచించారు. గత కొంత కాలంగా పొగాకు ఉత్పత్తులకు సంబందించి వివాదాస్పద వ్యాఖ్యలు వస్తున్న నేపథ్యంలో మోదీ ప్రకటన కొంత క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై తీసుకోబోతున్న చర్యలకు సంబందించి కొంత అవగాహన కలిగేలా ప్రధాని మోదీ హెచ్చరిక సైజ్ ను మరింత పెంచాలని సూచించారు. సిగరెట్ బాక్సులపై దాదాపు 60 నుండి 65 శాతం వరకు వార్నింగ్ ఉండాలని కూడా సూచించారని సమాచారం.
పొగాకు ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్పడానికి ఎలాంటి సైంటిఫిక్ ఆధారం లేదని బిజెపి ఎంపీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దాంతో భాజపా పార్టీతో మిగిలిన పార్టీలు కూడా దీనిపై చర్చించుకోవడం మొదలు పెట్టాయి. అయితే పొగాకు ఉత్పత్తుల పై వార్నింగ్ ఫలితంగా పొగాకు సంబందిత ఉత్పత్తుల బిజినెస్ తగ్గిపోతుందని మరో ఎంపీ వ్యాఖ్యానించారు. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా వారి మాటలపై వివరణ ఇచ్చారు. పొగాకు ఉత్పత్తిదారుల లాబీయింగ్ కు తాము లొంగలేదని వెల్లడించారు. గతంలోనే పొగాకు ఉత్పత్తులపై ట్యాక్స్ ను పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే రిటెల్ గా సిగరెట్ లు అమ్మకుండా కూడా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. అయితే మోదీ సూచనతో కేంద్ర ఆరోగ్య శాఖ ఆ మేరకు హెచ్చరిక సైజ్ ను పెంచుతుందా చూడాలి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more