ఉపాద్యాయులుగా సమాజానికి మార్గదర్శకంగా నిలవాల్సింది పోయి.. వారే దారుణాలకు ఒడిగడితే.. సభ్య సమాజం తలదించుకునేలా కీచక గురువులై కూతుళ్ల వయస్సున్న విద్యార్థినులపై లైంగిక వూదింపులకు పాల్పడితే.. వారిని ఏమనాలి. బావి తరాలకు బంగారు బాటలు వేసి నడిపించాల్సిన గురువులు.. మార్కులు వేస్తామని సాకును ఎరగా చూపి ఏకంగా 49 మంది పాఠశాల విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
మహారాష్ట్రలోని అకోలాలో వున్న జవహర్ నవోదయ విద్యాలయం ఉపాధ్యాయులుగా కోనసాగుతున్న ఇద్దరు ప్రాక్టికల్స్ లో మార్కులు వేయాలంటే.. తాము చెప్పినట్టు నడుచుకోవాలని.. లైంగిక వేదింపులకు పాల్పడ్డారని విద్యార్థినులు ఆరోపించారు. వీరి వేధింపులు భరించలేక ఓ విద్యార్థరిని మహారాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు ఆశా మిర్జాకు ఫిర్యాదు చేశారు. ప్రాక్టికల్ పరీక్షల్లో మార్కులు వేయమని బెదిరింపులకు గురిచేసిన కెమెస్ట్రీ, బయోలజీ ఉపాధ్యాయులు తనపై చాలా కాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని బాధిత విద్యార్థిని పిర్యాదు చేసింది.. తమతో శరీరక సంబంధం ఏర్పర్చుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదు చేసింది
కాగా మరికోందరు విద్యార్థులు ఈ విషయమై ప్రిన్సిపాల్ రామావతార్ సింగ్ ఫిర్యాదు చేశారు. ఆయన పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసి నిందిత ఉపాధ్యాయులపై విచారణ చేపట్టారు. కాగా, తమ ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని కూడా నిందిత ఉపాధ్యాయులు ఒత్తడి తెచ్చారని బాధిత విద్యార్థినులు తెలిపారు. చివరకు ప్రధానోపాధ్యుడు రామావతార్ సింగ్ పిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, కీచక ఉపాధ్యాయుల విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ అరుణ్ షిండే, సంజయ్ ఖడ్సే, మహిళా కమిషన్ సభ్యులు ఆశా మీర్జే నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more