LordRama | Kalyanam | Ap

Today lord ramas kalyanam in ontimitta of kadappa dist of ap

rama, kalyanam, ap, chandrababu, ontimitta, kadapa, narasimhan

today lord ramas kalyanam in ontimitta of kadappa dist of ap. andhrapradesh cm chandrababu naidu and governor narasimhan will aprticipate in the kalyanam of lord rama.

ఒంటిమిట్టలో నేడు రాములోరి కళ్యాణం

Posted: 04/02/2015 08:54 AM IST
Today lord ramas kalyanam in ontimitta of kadappa dist of ap

ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా ఒంటిమిట్టలో నేడు కోదండరామయ్య కల్యాణం జరుగనుంది. రాత్రి వెన్నెల్లో, శుక్లపక్ష చతుర్దశి ఉత్తరఫాల్గుణి నక్షత్రం వృశ్చికాలగ్నంలో 9 నుండి 10 గంటల మధ్య సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలో రాష్ట్ర గవర్నర్ ఇ ఎస్ ఎల్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఇతర ప్రముఖులు పాల్గొంటారు. చైత్రమాసంలో రామనవమి తర్వాత ఆరవ రోజు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. అయితే ఈసారి రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అధికారికంగా శ్రీరామ నవమి వేడుకలకు ఒంటిమిట్టను ఎంచుకోవడంతో సందడి నెలకొంది. ఆలయంలో తగినంత స్థలం లేకపోవడంతో దక్షిణ ద్వారం వైపున ఉన్న86 ఇళ్లను తొలగించి 17 ఎకరాలలో విశాలమైన కల్యాణ వేదిక, చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ఎల్‌సీడీ టీవీలను కూడా అమర్చారు.

టీటీడీ అధికారులు తిరుపతి దేవస్థానం పక్షాన స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఒంటిమిట్టలో కల్యాణోత్సవ పైలాన్ ఆవిష్కరణతో పాటు పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో ముఖ్యమంత్రి బహిరంగ సభ కూడా ఉంటుంది. కాగా కల్యాణాన్ని వీక్షించేందుకు సుమారు 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని భావిస్తున్నారు. వారికి వసతులు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. పెద్ద యెత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rama  kalyanam  ap  chandrababu  ontimitta  kadapa  narasimhan  

Other Articles