ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో ఎన్నడూలేని విధంగా రికార్డు విజయాన్ని నమోదు చేసిన భారతీయ జనతాపార్టీ (బీజేపీ).. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఘనతను సాధించింది. 8.8 కోట్ల మంది సభ్యులతో ఆ పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. నిన్నటిదాకా 8.6 కోట్ల మంది సభ్యులతో ‘కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా’ అతిపెద్ద పార్టీ కొనసాగుతూ వస్తోంది కానీ.. తాజాగా ఆ పార్టీ రికార్డును బీజేపీ అధిగమించింది.
మోడీ ప్రధాని పగ్గాలు చేపట్టినప్పటి నుంచి దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆ పార్టీ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఇతర పార్టీ నేతలు ఎంతోమంది బీజేపీలోకి జంప్ అయ్యారు. ఇంకా సభ్యత్వ నమోదు కొనసాగుతూనే వుంది. అయితే.. ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారి సంఖ్య ప్రస్తుతానికి 8.8 కోట్లు దాటింది. బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న అమిత్ షా దిశానిర్దేశంతో పార్టీ నేతలు సభ్యత్వ నమోదు వేగాన్ని పెంచారు. మరికొన్నాళ్లపాటు సాగే ఈ సభ్యత్వ నమోదులో 10 కోట్ల మంది సభ్యులను చేర్చాలని అమిత్ షా పిలుపునిచ్చారు. ఆ దిశగానే నేతలు వేగంగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ సభ్యత్వ నమోదు సంఖ్య 8.8 కోట్లకు చేరింది.
అమిత్ షా పిలుపునిచ్చినట్లు పార్టీ సభ్యత్వ నమోదు సంఖ్య 10 కోట్లు మందికి చేరితో.. భవిష్యత్తులో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా బీజేపీ దరిదాపుల్లోకి వచ్చే అవకాశమే వుండదని భావిస్తున్నారు. ఏదైతేనేం.. ఇదంతా మోడీ హవా కారణంగానే జరుగుతోందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంతాబాగానే వుంది కానీ.. పాలనావిషయంలో బీజేపీ వెనకపడితే.. ఈ సంఖ్య తగ్గే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more