ఆమ్ ఆద్మీ పార్టలో గత కొంత కాలంగా నడుస్తున్న వివాదాలకు తెరదించాలని బావిస్తోంది. అందులో భాగంగా ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లను సాగనంపాలా లేక అలాగే కొనసాగించాలా అన్న అంశంపై పలు చర్చలు జరిగాయి. శనివారం పార్టీ నేషనల్ కౌన్సిల్ మీటింగ్ కు ముందుగానే పార్టీలో సంక్షోభానికి తెర దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే పార్టీ నుండి ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లను సాగనంపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు సమాచారం.
* పార్టీలో తలెత్తిన సంక్షోభాన్ని నివారించడానికి ఆప్ పార్టీ శనివారం జరగనున్న నేషనల్ కౌన్సిల్ మీటింగ్ కు ముందే కేవలం 24 గంటల్లోనే రెండు సార్లు సమావేశమయింది.
* తాము విధించిన షరతులను పార్టీ అమలు చేస్తుందని హామీ ఇస్తే, రాజీనామాకు సిద్దమని మార్చి 17న యోగేంద్రయాదవ్, ప్రశాంత్ భూషణ్ లు పార్టీకి లేఖలు రాశారు.
* ప్రశాంత్ భూషణ్ అసలు కేజ్రీవాల్ ఆప్ కన్వీనర్ పదవికి రాజీనామా చెయ్యాలని అననే లేదని మీడియా ముందు చెప్పుకొచ్చారు.కేవలం మీడియా కట్టుకథలే అని కొట్టిపారేశారు.
* పార్టీలో ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ ల గురించి దాదాపుగా అన్ని దారులు మూసుకుపోయాయని సంజయ్ సింగ్ మీడియాకు తెలిపారు.
* పార్టీ ముఖ్య పదవుల నుండి ఇద్దరు నేతలను తొలగించాలని గతంలోనే పార్టీ ఓటింగ్ ద్వారా నిర్ణయించిందని మనీష్ సిసోడియా తెలిపారు. కాగా ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ రాజీనామా విషయంలో పార్టీ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.
* ఆప్ లో పార్టీ నేతలతో పాటు వాలంటీర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని, వారి నిర్ణయాన్ని గౌరవించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది.
* అసలు పార్టీలో ప్రశాంత్ భూషణ్, యోగేంద్రయాదవ్ లను కొనసాగించడానికి కేజ్రీవాల్ సుముఖంగా లేని కారణంగా, కేజ్రీవాల్ బృందం వారిని సాగనంపే పనిలో ఉంది.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more