కోర్టు సమన్లు అందుకోవడంతో తాను కలత చెందానని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. అయితే జీవితంలో ఇదీ ఓ భాగంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీచేయడంపై మాజీ ప్రధాని మన్మోహన్ స్పందించారు. ఈ కేసులో తన వాదనను, వాస్తవాలను న్యాయస్థానం ముందు పెడతానని, సత్యం విజయం సాధిస్తుందని నమ్ముతున్నానన్నారు. కోర్టు నోటీసులు రావడంతో అప్ సెట్ అయిన మాట నిజమేనన్నారు. తాను న్యాయ వ్యవస్థను గౌరవిస్తానని, ఇప్పటికే తన వైఖరిని సీబీఐకి స్పష్టం చేశామన్నారు. ఇదొక మంచి అవకాశం..న్యాయ విచారణ కు తానెప్పుడూ సిద్ధమన్నారు. దీనిపై లీగల్ కౌన్సిల్ లో చర్చిస్తామని చెప్పారు.
మన్మోహన్తో పాటు కుమారమంగళం బిర్లా, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పరేఖ్, మరో ముగ్గురికి సమన్లు జారీ అయ్యాయి. ఏప్రిల్ 8న విచారణకు హాజరు కావాలని ప్రత్యేక కోర్టు వారిని ఆదేశించింది. ఇదిలా ఉంటే సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేయడం పై బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ చేసిన పాపానికి మన్మోహన్ శిక్ష అనుభవిస్తున్నారని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యానించారు. దీనిపై జాతికి, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీపై మరో మరక. ఆ పార్టీని సమర్ధిస్తున్న మిగతా పార్టీలన్నీ ఇప్పటికైనా పునరాలోచించుకోవాలని ఆయన జావదేకర్ అన్నారు.
బీజేపీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ మనీష్ తివారి మాట్లాడుతూ మన్మోహన్ చాలా పారదర్శకంగా. నిజాయితీగా వ్యవహరించారని పేర్కొన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. బొగ్గు కేటాయింపులను పరిశీలించిన సుప్రీంకోర్టు డా. మన్మోహన్ కు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదని గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్ తప్పులు చేసి వుంటారన్న విషయంలో యావత్ దేశం వ్యతిరేకిస్తుందని మరో కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ అన్నారు. మరోవైపు మాజీ కోల్ కార్యదర్శి పీసీ పరాక్ సమన్లపై ఆశ్యర్యవ్యక్తం చేశారు. దీనిపై ఇపుడు తానేమీ మాట్లాడలేనన్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more