తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూ.లక్షా 15వేల 689కోట్లని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. 2015-16 సంవత్సరానికి బడ్జెట్ను ఆయన ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తంలో ప్రణాళిక వ్యయం 52 వేల 383 కోట్ల రూపాయలు కాగా, ప్రణాళికేతర వ్యయం 63 వేల 306 కోట్ల రూపాయలుగా ఆయన తెలిపారు. ఈ సారి బడ్జెట్ లో ద్రవ్యలోటుగా రూ. 16 వేల 969 కోట్ల రూపాయలను చూపిన ఈటెల అర్థిక మిగులు బడ్జెట్ ను 531 కోట్ల రూపాయలను అర్ధిక మిగులుగా ఆయన చూపారు.
ప్రభుత్వం త్వరలో గ్రేటర్ ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో గ్రేటర్ వాసులను ప్రసన్నం చేసుకునేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు తాజా బడ్జెట్లో రూ.526 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి రాజేందర్ అన్నారు. నగరంలో ఆకాశ మార్గాల నిర్మాణాలకు 1600 కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ ఏడాది చివరినాటికి హైదరాబాద్కు 170 ఎంజీడీల నీటి సరఫరా చేసేందుకు కూడా బడ్జెట్ లో వెయ్యి కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. హైదరాబాద్ ప్రజల అవసరార్థం నిర్మిస్తున్న ప్రజా రవాణ వ్యవస్థ మెట్రో రైలుకు బడ్జెట్ లో రూ. 416 కోట్లు ఇచ్చారు
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయకు బడ్జెట్లో రూ.2,803 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిషన్ లో భాగంగా 9వేల 308 చెరువులను పునరిద్దరించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకు గాను రోడ్లు భవనాల శాఖకు రూ. 4980 కోట్ల రూపాయలు, పంచాయితీ రాజ్ శాఖ రూ 2, 421 కోట్ల రూపాయలను కేటాయించారు. అదే సమయంలో తెలంగాణలోని టెంపుల్ సిటీ యాదాద్రికి అభివృద్ది కోసం దేవాలయ అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందుకుగాను ఇప్పటికే రూ.100 కోట్లు ఖర్చు పెట్టామన్నా ఆర్థిక మంత్రి ఈటెల... మరో రూ.వంద కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు.
బడ్జెట్ ముఖ్యాంశాలు..
* రాష్ట్ర బడ్జెట్ రూ.లక్షా 15వేల 689 కోట్లు.
* ప్రణాళిక వ్యయం రూ. 52వేల 383 కోట్లు.
* ప్రణాళికేతర వ్యయం రూ.63వేల 306 కోట్లు
* రాష్ట్ర ఆర్థిక మిగులు రూ.531 కోట్లు
* ద్రవ్యలోటు రూ. 16,969 కోట్లు
* రుణమాఫీ కోసం రూ.4,800కోట్లు
* పేద యువతుల వివాహం కోసం కల్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టాం.
* రాష్ట్ర విద్యుత్ రంగం పునరుద్ధరణకు తొలి అడుగులు పడ్డాయి.
* మరో రూ.4వేల కోట్లు అప్పు తెచ్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం.
* జీహెచ్ంఎసీకి రూ.526కోట్లు
* ఆకాశ మార్గాలకు రూ.1600 కోట్లు
* ఈఏడాది చివరినాటికి హైదరాబాద్కు 170 ఎంజీడీల నీటి సరఫరా
* యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి సంస్థ ఏర్పాటు
* యాదగిరిగుట్టకు ఇప్పటికే రూ.100 కోట్లు ఖర్చు పెట్టాం.. మరో రూ.వంద కోట్లు కేటాయింపు
* మిషన్ కాకతీయకు రూ.2,083కోట్లు
* ఈ ఆర్థిక సంవత్సరంలో 9,308 చెరువుల పునరుద్ధరణ
* రోడ్లు భవనాల శాఖకు రూ.4,980కోట్లు
* పంచాయతీరాజ్శాఖకు రూ.2,421 కోట్లు
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more