హర్యానా మాజీ ముఖ్యమంత్రి. ఐ.ఎన్.ఎల్.డి పార్టీ అధినేత ఓం ప్రకాష్ చౌతాలాకు మరోమారు చుక్కెదైంది., ఈ సారి ఆయనతో పాటు ఆయన కుమారుడికి ఢిల్లీ హైకోర్టులో చెకెదురైంది. ఉపాధ్యాయుల నియామకం కుంభకోణం విషయంలో ఓం ప్రకాష్ చౌతాల, ఆయన కుమారుడు సహా మరో 53 మందికి విధించిన పదేళ్ల జైలు శిక్షను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. ఈ కుంభకోణంలో కింది కోర్టు విధించిన శిక్షను తగ్గించాలని చౌతాల సహా ఆయన కుమారుడు ఢిల్లీ హైకోర్టులో అప్పీలు దాఖలు చేసుకున్నారు.
కాగా, అప్పిలుపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిద్ధార్థ్ మ్రిదుల్ ఉపాధ్యయ కుంభకోణం కేసులో ప్రత్యేక సీబిఐ కోర్టు విధించిన పదేళ్ల జైలు శిక్షను సమర్థించారు. ఈ కేసులో దోషులుగా తేలిన షేర్ సింగ్ బాద్షామీ సహా ఇద్దరు ఐఎఎస్ అధికారుుల విద్యాధర్, సంజీవ్ కుమార్ లకు విధించిన శిక్షను కూడా సమర్ధించింది. ఉపాధ్యయ నియామకాల ప్రసహనాన్ని మొత్తంగా లంచమయంగా మార్చారని కోర్టు అభిప్రాయపడింది. నియామకాలలో ప్రజా ప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారని కూడా న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ కేసులో పెండింగ్ లో వున్న అన్ని బెయిల్ ధరఖాస్తులను తోసిపచ్చింది. దోషులందరినీ పోలీసులకు సరండర్ కావాలని సూచించింది.
2000 సంవత్సరంలో దాదాపు 3,206మంది జూనియర్ టీచర్ నియామకాలకు సంబంధించి అవినీతికి పాల్పడ్డారని చౌతాల సహా ఆయన కుమారుడికి పదేళ్ల జైలు శిక్ష పడింది. మరికొంతమందికి నాలుగేళ్లు, ఇంకొందరికి ఐదేళ్ల శిక్ష పడింది. కాగా నాలుగేళ్లు శిక్ష పడిన వారిపై న్యాయస్థానం కనుకరించింది. వారి శిక్షను రెండేళ్లకు పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రెండేళ్లు జైలు జీవితం గడిపిన నిందితులను విడుదల చేయాలని న్యాయస్థానం అదేశాలు జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more