తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ అన్నల అలజడి మొదలైంది. దశాబ్దానికిపైగా సద్దుమణిగిన జనశక్తి దళాలు తిరిగి ఊపిరిపోసుకుంటున్నాయి. ప్రజల్లో కలిసిపోయి.. ప్రజాసంఘాలతో కలిసి పనిచేస్తూ దళాలను విస్తరించడంలో ఆరితేరిన జనశక్తి తిరిగి పల్నాడులో ఉనికి చాటుకుంటంది. మరోవైపు మాజీ మావోయిస్టు దళాల పేరుతో పలు జిల్లాల్లో వసూళ్లు జోరుగా సాగుతున్నాయి. అటు జనశక్తి కదలికలు.. ఇటు మాజీల వసూళ్లపై నిఘా వర్గాలకు స్పష్టమైన సమాచారం అందించడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.
ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు కార్యక్రమాలు ప్రారంభమైనట్లు నిఘా వర్గాల వద్ద సమాచారం ఉంది. జనశక్తి దళం కూడా మిర్యాలగూడ కేంద్రంగా తన కార్యకలాపాలను ప్రారంభించిందని, ఇక్కడి నుంచే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో విస్తరించాలని జనశక్తి దళ నేతలు ప్రయత్నాలు ప్రారంభినట్లు నిఘావర్గాల వద్ద ఖచ్చితమైన సమాచారం ఉంది. ఈ క్రమంలోనే గ్రామ కమిటీలను కూడా నియమిస్తున్నట్లు చెబుతున్నారు. వైఎస్ హయాంలో జనశక్తి తరఫున ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొన్న నేతల్లో ఒకరు మిర్యాలగూడ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించారని సమాచారం. దీంతో ప్రజాసంఘాల నేతల కదలికలపైనా పోలీసులు దృష్టి సారించారు. తెలంగాణ, ఏపీల్లో 23 ప్రజా సంఘాల సహకారంతో తిరిగి పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన మాజీ మావోయిస్టులు విచారణలో వెల్లడించారు. దీంతో పోలీసులు ఆయా సంఘాల ప్రతినిధులపై ప్రత్యేక నిఘా ఉంచారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో గత కొంత కాలంగా నిలిచిన మాయిస్టు కార్యకలాపాలు మళ్లీ మొదలయ్యాయన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more