నాగార్జున సాగర్ పై వివాదంపై రాజ్ భవన్ లో చర్చ ముగిసింది. రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రలు, నీటిపారుదల శాఖ మంత్రులు, డిజిపిలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రులు సమావేశానికి ముందు తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి గవర్నర్ నరసింహన్ తో భేటి అయ్యారు. తెలంగాణ అనుసరిస్తున్న వైఖరిని వివరించారు. తెలంగాణ తమకు అన్యాయం చేస్తోందని అనడం భావ్యం కాదని హరీష్ రావ్ అన్నారు. నాగార్జున సాగర్ వద్ద కేంద్ర బలగాలు మోహరించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గవర్నర్ ను కోరినట్లు సమాచారం.
ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రితో భేటి అయిన గవర్నర్ కెసిఆర్ చెప్పిన వివరాలను విన్నారు. తర్వాత చంద్రబాబుతో విడిగా సమావేశమయ్యారు. అనంతరం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రలతో కలిసి భేటి అయ్యారు. అయితే ఏపికి రావలసిన నీటిని విడుదల చెయ్యాలని చంద్రబాబు నాయుడు చేసిన ప్రతిపాదనను కెసిఆర్ తిరస్కరించారని సమాచారం. గవర్నర్ తో భేటి తర్వాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజ్ భవన్ నుండి వెళ్లిపోయారు. అయితే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక పరిష్కారానికి రావాలని గవర్నర్ సూచించినట్లు తెలిసింది.
రాజ్ భవన్ లో ముఖ్యమంత్రుల భేటి తర్వాత ఏపి మంత్రి దేవినేని ఉమ, తెలంగాణ మంత్రి హరీష్ రావ్ మీడియాతో మాట్లాడారు. రాజకీయ నాయకులు, పోలీసులు డ్యాం మీదకు వెళ్లకూడదని నిర్ణయించినట్లు, ఇరు రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్లు మాత్రమే డ్యాంను పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపి మంత్రి దేవినేని ఉమ, తెలంగాణ మంత్రి హరీష్ రావ్ లు ప్రకటించారు. ఇరు రాష్ట్రాల్లో పంటలు ఎండిపోకుండా కాపాడుకోవాలని నిర్ణయించుకున్నామని మంత్రి హరీష్ రావ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అధికారుల సహాయంతో నీటి విడుదలపై వచ్చే ఖరీఫ్ లో నిర్ణయం తీసుకోవాలని భావించినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల అధికారులు కూర్చుని సాగునీటి కోసం అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకోవాలని అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more