బెంగళూరులోని ఓ స్కూల్లో ఘోరం జరిగింది. అభం శుభం తెలియని ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు ఓ కామాందుడు. ఉపాద్యాయ వృత్తిలో కొనసాగుతూ.. నీచాతినీచమైన పనికి పూనుకున్నాడు. వరుసగా పాఠశాల విద్యార్థినులపై జరుగుతున్న అకృత్యాల నేపథ్యంలో పిల్లలను పాఠశాలలకు పంపడానికి కూడా తల్లిదండ్రులు ఆలోచించాల్సి వస్తుంది. సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యవహరించిన వ్యాయామ ఉపాధ్యాయుడిని ఆమె తల్లిదండ్రులు పట్టుకుని చితకబాదారు. ఈ ఘటన పశ్చిమ బెంగళూరులోని బయతారాయణపుర ప్రాంతంలో జరిగింది.
ఈ దారుణంతో తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు.. స్కూలు ప్రాంగణంలో ఉన్న వాహనాలను తగలబెట్టారు. స్కూలు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దాంతో పోలీసులు చేరుకుని బాష్పవాయువు ప్రయోగించి లాఠీచార్జి కూడా చేశారు. ఈ గందరగోళంలో ఓ కానిస్టేబుల్కు తలమీద గాయాలయ్యాయి. అతడిని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. బుధవారం ఉదయం ఏడు గంటలకు ఏడేళ్ల బాలిక తల్లిదండ్రులు స్కూలుకు వచ్చి, తమ కుమార్తెను ఫిజికల్ ట్రైనింగ్ టీచర్ లైంగికంగా వేధించారని ఆరోపించారు. ఈ విషయం వెంటనే చుట్టుపక్కల ప్రాంతాలకు పాకిపోయి, స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
నిందితుడిని కఠినంగా శిక్షించాలని పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఆందోళనకారుల మధ్య నుంచి నిందితుడిని తీసుకెళ్లడం కష్టమని పోలీసులకు అర్థమైపోయింది. చివరకు ఎలాగోలా అతడిని బయటకు తీసుకొచ్చారు. జనంలో కొందరు అతడిని కొట్టడం మొదలుపెట్టగా, పోలీసులు లాఠీలకు పనిచెప్పి, పీటీని జీపులోకి ఎక్కించారు. అనంతరం జనంలో ఆగ్రహావేశాలు పెరగడంతో పలు వాహనాలకు నిప్పంటించారు. నాలుగు ప్లటూన్ల రిజర్వు పోలీసు బలగాలను, వాటర్ కేనన్లను కూడా మోహరించారు. సీనియర్ పోలీసు అధికారులు ఎంతగా విజ్ఞప్తి చేసినా జనం వినిపించుకోలేదని నగర పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి తెలిపారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more