ఒక పక్క భారత్ పాక్ ల మధ్య ప్రచ్చన్న "యుద్ధం" నడుస్తుంటే ఇంకో పక్క నోబెల్ వేదికపై జరిగిన కార్యక్రమం లో ఇరుదేశాలకు చెందిన భారతీయుడు కైలాష్ సత్యార్తి, పాకిస్తాన్ బాలిక మలాలా యూసఫ్ జాహి కలిసి సంయుక్తంగా నోబెల్ "శాంతి" పురస్కారాన్ని అందుకున్నారు. ఇరు దేశాల మధ్య అంతర్గత యుద్ధ వాతవరానం నెలకొన్న పరిస్థితిలో ఇద్దరు కలిసి శాంతి బహుమతి ని స్వీకరించి ఇరు దేశాలకు ఆదర్శ ప్రాయులయ్యారు. ఈ అవార్డు ను స్వీకరిస్తున్నపుడు విశ్వ ‘శాంతి’ పతాకగా రెపరెపలాడింది. ఒకరు పాకిస్తాన్ నుంచి వస్తే మరొకరు భారత్ నుంచి వచ్చారు. ఒకరు ముస్లిం. మరొకరు హిందువు. ప్రపంచమంతా ప్రస్తుతం కోరుకుంటున్న మరింత ఐకమత్యం, దేశాల సౌభ్రాతృత్వాకు వీరు ప్రతీకలు.
వారిద్దరి కృషి బాలల హక్కుల ప్రాధాన్యాన్ని ప్రపంచానికి చాటేలా చేసింది. బాలల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న భారత్కు చెందిన కైలాశ్ సత్యార్థి(60), పాక్ బాలిక మలాలా యూసఫ్ జాయ్(17) చరిత్రలో నిలిచిపోయేలా అరుదైన గౌరవం పొందారు.
ఈ కార్యక్రమం లో మలాలా అత్యంత ఆకర్షణగా నిలిచింది. దానికి ఒక కారణం ఉంది ఈ అవార్డు తీసుకున్న వాళ్ళలో ఎంతో మంది మేధావులు ఎంతో మంది సర్వ విజ్ఞాన సంపన్నులు ఉన్నారు. కాని వాళ్ళ వయసులో ఎంతో పెద్దవాళ్ళు అయి ఉండవచ్చు కాని ఈ అవార్డు తీసుకున్న వాళ్ళలో మలాలా అత్యంత పిన్న వయస్కురాలు (17 సంవత్సరాలు) కాని ఆమె చేసిన పని ప్రపంచం మొత్తం గర్వించదగ్గ పని. ఆ చిన్నది ఈ కార్యక్రమం లో ప్రసంగిస్తూ ఈ అవార్డ్ నాది మాత్రమే కాదు. చదువుకోవాలనుకుంటోన్న చిన్నారులు.. భయానక పరిస్థితుల్లో ఉంటూ శాంతిని కోరుకుంటున్న చిన్నారులు.. మార్పును కోరుకుంటున్న చిన్నారులు.. వీరందరిదీ ఈ అవార్డు అని చెప్పినప్పుడు చప్పట్లు మారుమోగాయి.
నోబెల్ బహుమతి పురస్కార గ్రహితలైన సత్యార్తి మరియు మలాలా ను ఇద్దర్ని మోడీ అభినందిచారు. ఖైలాష్ సత్యార్తి ని ఉద్దేశించి దేశం మొత్తం మిమ్మల్ని చూసి గర్వ పడుతుందని తన సందేశం లో పేర్కొన్నారు.
హరి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more