రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మళ్లీ తండ్రి కాబోతున్నారు. అది కూడా ఓ మహా నేతకు, ఉత్తర్ ప్రదేశ్ లో అధికారంలో వున్న సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ కు లాలూ ప్రసాద్ యాదవ్ తండ్రి కాబోతున్నారు. అదేంటినుకుంటున్నారా.. లాలూ ప్రసాద్ కుమార్తె తనయుడు, మెయిన్ పురి పార్లమెంటరీ సభ్యుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వివాహంతో వీరిద్దరి వరుసలు మారుతున్నాయి. ఎందుకంటే తేజ్ ప్రతాప్ యాదవ్ కు తన చిన్నకుమార్తె రాజ్ లక్ష్మీకి వివాహం కుదిరింది. ఈ మేరకు రెండు కుటుంబాల పెద్దలు అంగీకారానికి వచ్చారు.
లాలూ రాజకీయ వారసుడిగా ఆయన మనవడు తేజ్ ప్రతాప్ యాదవ్ తొలిసారిగా రాజకీయ అరంగ్రేటం చేశాడు. లలూ ప్రసాద్ యాదవ్ ను ఎన్నికల్లో పోటీచేసేందుకు అనర్హుడిగా కోర్టు ప్రకటించిన నేపథ్యంలో ఆయన తన మనుమడిని వారసుడిగా ప్రకటించారు. తొలి సారితోనే ఆయన పార్లమెంటులో అడుగుపెట్టారు. ములాయంకు గట్టి పట్టున్న మెయిన్ పురి పార్లమెంటు నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీ చేసిన ఆయన ప్రతికూల వాతావరణంలోనూ ఎంపీగా ఎన్నికైయ్యారు. దీంతో మనవడికి పెళ్లి చేయాలని యోచించిన లాలూ.. ములాయం సింగ్ చిన్న కూమార్తె రాజ్ లక్ష్మీతో పెళ్లి కుదిర్చాడు. డిసెంబర్ నెల మధ్యలో వీరి నిశ్చితార్థం ఫిక్స్ చేయగా, ఫిబ్రవరిలో ఇరు యాదవ నేతల ద్వయం ఇళ్లలోనూ పెళ్లి బాజాలు మ్రెగనున్నాయి. దీంతో లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ లు తండ్రి కోడుకుల వరసలో బందువులు కాబోతున్నారు.
కాగా, ఈ పెళ్లితో ఉత్తరాది రాజకీయాలు కొత్త రూపు సంతరించుకోబోతున్నాయి. ఇప్పటికే బీహార్లో అధికార జనతాదళ్ (యూ), మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సారథ్యంలోని ఆర్జేడీ రాబోయే ఎన్నికల్లో కలసి పనిచేయాలని నిర్ణయించగా, ఈ కూటమికి ఉత్తరప్రదేశ్లోని అధికార సమాజ్వాదీ పార్టీ దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు మంచి సన్నిహితులుగా వుండి మండల్ కమీషన్ వ్యవస్థను కోనసాగించాలని చేసిన ఉద్యమాల్లో ఇరువురు నేతలు చురుగ్గా పాల్గొని కలసి పనిచేశారు. అ తరువాత ప్రధాని పదవి విషయంలో 1997లో వారిద్దరి మధ్య విభేధాలు పోడచూపడంతో దశాబ్దమున్నార కాలం పాటు వారు దూరంగానే వున్నారు. కాగా ఇప్పడు మళ్లీ వారు తమ స్నేహాన్ని.. బంధుత్వంగా మార్చుకోవడంతో రాజకీయ వర్గాలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఈ యాదవ ద్వయం బంధువులు కాబోతున్నారన్న వార్తతో సమాజ్ వాదీలు కూడా సంబరపడుతున్నారు. తమ నేత ములాయం బహుచక్కని నిర్ణయం తీసుకున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more