డీఎల్ఎఫ్ భూములకు తమ ప్రభుత్వానికి సంబంధం ఎక్కడుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. తమకు డీఎల్ఎఫ్ భూములకు సంబంధం లేదని స్పష్టం చేశారు. డీఎల్ఎఫ్ భూములపై శాసనసభలో ప్రకటన చేసిన కేసీఆర్ మాట్లాడుతూ శేరిలింగంపల్లిలో 471 ఎకరాలు ఏపీఐఐకి అప్పగించారన్నారు. ఏపీఐఐసీ కొంత భూమిని విక్రయించి ప్రభుత్వానికి నిధులు ఇచ్చారన్నారు. డీఎల్ఎఫ్ 580.81 కోట్లతో 31.31 ఎకరాలు కొనుగోలు చేసిందని, 2013లో డీఎల్ఎఫ్ అదనంగా రూ.34 కోట్లు చెల్లించి రిజిస్ర్టేషన్ చేసుకుందని చెప్పారు. డీఎల్ఎఫ్ కొనుగోలు చేసిన భూముల్లో వారసత్వ భూములు ఉన్నందున రాయదుర్గంలో గత ప్రభుత్వం ప్రత్యామ్నాయ భూమి ఇచ్చిందని కేసీఆర్ వెల్లడించారు. ఈ భూములు అమ్మవద్దంటూ తాము పోరాడామని సభకు తెలియజేశారు.
గత ప్రభుత్వం 10 వేల కోట్ల విలువైన భూములు అమ్మిందని, తెలంగాణ ఏర్పాడక ముందే భూకేయింపులు జరిగాయని తెలిపారు. కొందరు పచ్చి అబద్దాలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. తనను, తన కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారని మండిపడ్డారు. దొర ఇంకో దొరకు రాసిచ్చారనడం సమంజసమా అని కేసీఆర్ ప్రశ్నించారు. తమది ఎవరో నామినేట్ చేస్తే వచ్చిన ప్రభుత్వం కాదని, ప్రజలు తమకు అధికారం ఇచ్చారన్నారు. తాము ఏం చేసినా తప్పుబడితే సహించమని, ప్రతిపక్షాల నిర్మాణాత్మక సూచనలు స్వీకరిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. ఆరోపణలు రుజువు చేయని సభ్యులను బహిష్కరించాలన్నారు. పదవులు శాశ్వతం కాదు...సంస్కారంతో మాట్లాడాలని సూచించారు. ఫైళ్లను స్పీకర్ ముందు పెడదాం...తప్పెవరిదో తేల్చేద్దామని కేసీఆర్ అన్నారు. డీఎల్ఎఫ్ భూములను మైహోం రామేశ్వరరావు కొన్నారని, అదే భూమిలో గేమింగ్ సిటీకి అప్పటి సీఎం శంకుస్థాన చేసిన విషయాన్ని తెలిపారు. మైహోం భూముల్లో గేమింగ్ సిటీ ఎలా పెడతారంటూ రామేశ్వరరావు ధర్నాకు దిగారని, దీనికి కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ మద్దతిచ్చిందని చెప్పారు. రిజిస్టేషన్ల ఫీజు మాఫీ ఫైల్తో తమకు సంబంధంలేదని, గతంలో తీసుకున్న నిర్ణయాన్నే అమలు చేస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.
మైహోం సంస్థ ప్రభుత్వం నుంచి గజం కూడా పొందలేదని వివరించారు. బ్లాక్మెయిల్కు రామేశ్వరరావు లొంగకపోవడం వల్లే ఆరోపణలు చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలను సతాయిస్తే అభివృద్ధి జరగదన్నారు. మైండ్ స్పేస్, ఎమార్ భూకేటాయింపులపై చర్చిద్దామన్న ఆయన అవసరమైతే చర్చను మరో 20 రోజులు పొడిగిద్దామన్నారు. తప్పుడు ఆరోపణలు చేసిన వారు సభకు క్షమాపణ చెప్పాలని సీఎం కేసీఆర్ అన్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more