దేశ రాజధానిలో ఢిల్లీలో దారుణం జరిగింది. కన్న కూతరు అన్న కనికరం కూడా లేకుండా కసాయి తల్లిదండ్రులు ఆమెను బలితీసుకున్నారు. కులాంతర వివాహం చేసుకుందని కోపంతో తమ కుమార్తెను అతి దారుణంగా హత్య చేశారు. దిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్లోగల ప్రతిష్టాత్మక శ్రీవెంకటేశ్వర కళాశాలకు చెందిన 21ఏళ్ల భావన అనే యువతిని కన్న తల్లిదండ్రులే గోంతు నులిమి చంపేశారు. ఇందుకు అమ్మాయి మేనమాక కూడా సహకరించారు. తర్వాత మృతదేహాన్ని తమ గ్రామానికి తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలు నిర్వహించి కప్పెట్టేశారు.
వివరాల్లోకి వెళ్తే.. రియల్ ఎస్టేట్ వ్యాపారి, స్థానిక కాంగ్రెస్ కార్యకర్త అయిన జగ్మోహన్, ఆయన భార్య సావిత్రిల కూతరు భావన (21) ఈనెల 12వ తేదీన తనకు నచ్చిన యువకుడు అభిషేక్ సేఠ్ అనే యువకుడిని ఆర్యసమాజంలో పెళ్లి చేసుకుంది. అతడు కేబినెట్ సెక్రటేరియట్లో అసిస్టెంట్ ప్రోగ్రామర్గా పనిచేస్తున్నాడు. భావన రాజస్థానీ యాదవ కులానికి చెందినది కాగా, అభిషేక్ పంజాబీ. వారి వివాహ విషయం ఇంట్లో తెలియడంతో.. వారు భావనను క్షమించేశామని, పద్ధతిగా పెళ్లి చేస్తామని పిలిపించారు.
ఇంటికి తీసుకెళ్లిన తరువాత పంజాబీ కుర్రాడిని వదిలేయాలని, మరో పెళ్లికి సిద్దం కావాలని నచ్చజెప్పారు. పెళ్లి జరిగింది ఇక ఆ విషయాన్ని వదిలేయండని చెప్పిన భావనను అతి కిరాతకంగా గోంతు నులిమి చంపేశారు. తన భార్యను తీసుకెళ్లిన అమె తల్లిదండ్రులు ఇంకా పంపకపోవడంతో అభిషేక్ సేఠ్ పోలీసులను ఆశ్రయించడంతో విచారణ జరిపిన పోలీసులకు అసలు గుట్టు తెలిసింది. వారిపై పక్కా సాక్ష్యాలు ఉండటంతో తల్లిదండ్రులను అరెస్టు చేశామన్నారు. మృతురాలి తండ్రి జగ్మోహన్, తల్లి సావిత్రిలను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిపై హత్యకేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more