వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వున్న మహిళలను సరిగ్గా గౌరవించడం లేదని.. వారి పదవికి తగ్గట్టు మర్యాద ఇవ్వడం లేదని గతంలో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే! ఈ మేరకు కొంతమంది మహిళా కార్యకర్తలతోపాటు ఎంపీ కొత్తపల్లి గీత కూడా ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా కొత్తపల్లి గీత అయితే వైకాపా పార్టీ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తనపై అసభ్యకరంగా ఫేస్ బుక్ లో మెసేజ్ లు వస్తున్నాయని పేర్కొన్న నేపథ్యంలో వైకాపా ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. పైగా మహిళలకు ఆ పార్టీలో ఏమాత్రం గౌరవమర్యాదలు దక్కడం లేదని విమర్శించిన విషయం విదితమే! ఇప్పుడు తాజాగా ఆమె ఈ వేధింపులపై స్పీకర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
కొత్తపల్లి గీత విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తనకు జరుగుతున్న అన్యాయంపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని అన్నారు. తనపై వస్తున్న ఆరోపణలు ఎవరైనా ఎమ్మెల్యే చేసినవా లేక పార్టీయే ఇలా చేయించిందా..? అనేది స్పష్టం చేయాలని పేర్కొన్నారు. మహిళా ఎంపీ అనే చులకనభావంతో తనని చూస్తున్నారని... తాను ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని... ఎవరి ఆస్తులు తాను కాజేయలేదని తెలిపారు. తాను ఇంతవరకూ ఎవరిపై వ్యక్తిగత విమర్శలు చేయలేదని స్పష్టం చేశారు. చంద్రబాబును కలిసిన నేపథ్యంలో తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే ధైర్యం లేక ఇలాంటి చిల్లర రాజకీయాలకు వైకాపా పాల్పడుతోందని ఆరోపించారు. తాను ఒక ఎంపీ అయినప్పటికీ తనపై సామాజిక వెబ్ సైట్లలో వచ్చిన అసభ్యకర వ్యాఖ్యల మీద వైకాపా ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు.
అటు ఆ పార్టీకి చెందిన ఇతర మహిళా కార్యకర్తలు కూడా వైకాపా పార్టీ మీద నిప్పులు చెరుగుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వున్నప్పుడు మహిళలకు ఎంతో గౌరవం లభించేదని.. కానీ నేడు అలా జరగడం లేదని వాపోతున్నారు. పార్టీలో జరిగే మార్పుల విషయాలుగానీ.. తీసుకునే కీలక నిర్ణయాల గురించి తమకు వైకాపా విశ్లేషించడం లేదని.. మహిళలకు పార్టీకి చెందిన కార్యకలాపాల గురించి ఏమాత్రం చెప్పడం లేదని చెబుతున్నారు. అలాగే తమను పార్టీలో చాలా చులకన భావంతో చూస్తున్నారని వాపోతున్నారు. మరి ఈ విషయంపై వైకాపా ఎలా స్పందించనుందో వేచి చూడాలి. మరోవైపు కొత్తపల్లి ఫిర్యాదు మేరకు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోనున్నారో..?నంటూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more