షిరిడీ సాయిబాబా మహిమ గురించి తెలియనివాళ్లు ఈ ప్రపంచంలో ఎవరైనా వున్నారా..? ‘‘సబ్ కా మాలిక్ ఏక్ హై’’ అంటూ ప్రజలమధ్య వున్న మతబేధాలను తొలగించి అందరినీ ఒక దైవంవైపు అడుగులు వేయించిన సాయిబాబా... తన చమత్కారంతో ఏదో ఒక సమస్యతో బాధపడే వారి కష్టాలను దూరం చేసేవారు. దీంతో ఆయన్ను ఎంతో ఆరాధ్యంగా దేవుడిగా భావించి, అందరూ పూజించడం ప్రారంభించారు. ఇప్పటికీ ఆయన ఆలయాలకు హిందూ, ముస్లిం అని తేడాలేకుండా అందరూ దర్శించుకుంటున్నారు. కానీ ఈమధ్య ఈయన దేవుడు కాడంటూ శంకరాచార్య స్వరూపానంద వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘షిర్డీసాయి ఒక సాధారణ వ్యక్తి అని.. ఆయన దేవుడు ఎలా అవుతాడు’’ అంటూ చేసిన ఆయన వ్యాఖ్యలు పెద్ద సంచలన దుమారాన్నే రేపాయి.
తాజాగా ఇప్పుడు షిరిడీ సాయిబాబా దేవుడు కానే కాదని ధర్మ సంసద్ తీర్మానాలను జారీ చేసింది. ఇకనుంచి ఆయనను ఎవ్వరూ ఆరాధించరాదని హిందువులకు ఆ ధర్మ సంసద్ పిలుపునిచ్చింది. ‘‘షిరిడీ సాయి దేవుడు కాడు’’ అనే విషయం మీద చత్తీస్ గఢ్ లోని కబీర్ ధామ్ జిల్లాలో రెండు రోజుల పాటు ధర్మ సంసద్ చర్చా సదస్సు జరిగింది. ఈ సదస్సుకు హిందూమతానికి చెందిన 13 అఖారాల ప్రతినిధులు, అనేక మంది హిందూ మత ప్రముఖులు హాజరయ్యారు. ఇందుకు హాజరుకావాల్సిందిగా హాజరుకావాలంటూ షిరిడీలోని సాయి సంస్థాన్ కు కూడా ఆహ్వానం పంపినప్పటికీ అక్కడనుంచి ఎవరూ హాజరుకాలేదు.
ఈ సదస్సులో సాయిబాబాపై దీర్ఘంగా చర్చించిన అనంతరం ఆయన దేవుడు కాదని తీర్మానం చేశారు. గతంలో కూడా... మాంసాహారం తిన్న సాయిబాబా సన్యాసి కాదని, హిందువులు ఎవరూ ఆయనను ఆరాధించరాదని ద్వారకా శంకరాచార్య ప్రకటించిన సంగతి తెలిసిందే. కాశీ విద్వత్ పరిషత్ కూడా సాయిబాబా దేవుడు కాదని, గురువు కూడా కాదని తీర్మానించిన విషయాన్ని ఈ సదస్సులో గుర్తుచేసుకున్నారు. ఇలా ఒకరిమీదొకరు సాయిబాబాపై నిత్యం నిందలు వేయడం.. ఆపై ప్రజలు నిరసనలు వ్యక్తం చేయడంతో ఇందుకు పరిష్కారా మార్గాన్ని వెతకడం కోసం ఈ చర్చాసదస్సును నిర్వహించి, చివరికీ ఆయన దేవుడు కాడంటూ నిర్ణయానికి వచ్చి తీర్మానం చేసింది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more