ప్రపంచంలో మనదేశానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనది. అంతేకాదు ప్రజాస్వామ్య విలువలు పాటించటంలో అందరూ మనల్ని చూసి గౌరవిస్తారు. చట్టాలు చేసే గౌరవ శాసనకర్తలు ఈ మద్య అ గౌరవ పనులు చేస్తున్నారు. సమాజంలో వారి దాడులు, బల ప్రదర్శనకు స్థలం సరిపోనట్లు పార్లమెంటును వాడుకుంటున్నారు. మాటలు అనుకునే స్థాయి దాటి దాడులకు తెగబడుతున్నారు. ఇది గతంలో పలుమార్లు మనం చూశాం. పెప్పర్ స్ప్రే ఇందుకు ఉత్తమ ఉదాహరణ. అయితే ఈ సంస్కృతి కొనసాగటంపై రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ విచారం వ్యక్తం చేశారు. మృదు స్వభావిగా, తక్కువ మాట్లాడే ప్రణబ్.., తన స్టైల్లోనే ఎంపీలకు తలంటారు. ప్రత్యేకించి టిడిపి, తృణముల్ పార్టీ సభ్యులకని చెప్పాలి.
పార్లమెంటు భవనంలోని గ్రౌండుఫ్లోర్ 5 నెంబరు గది కోసం తృణమూల్ కాంగ్రెస్, టీడీపీ సభ్యులు బాహాబాహీకి దిగారు. చాలాకాలంగా 5వ నెంబర్ గది టీడీపీ ఆధీనంలో ఉంది. అయితే ఎన్నికల్లో వచ్చిన సీట్ల దృష్యా ఈ గదిని తృణమూల్ కాంగ్రెస్కు కేటాయించారు. కానీ గది ఖాళీ చేసేందుకు టీడీపీ సభ్యులు నిరాకరించడంతో గొడవ మొదలైంది. చివరకు మంగళవారం రోజు 5వ నెంబర్ గదికి ఉన్న టిడిపి బోర్డులు, సభ్యుల నేమ్ ప్లేటులు తొలగించి పక్కన పడేశారు, రూంను బలవంతంగా తృణముల్ సభ్యులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ప్రణబ్ కలత చెందారు.
పార్లమెంటు సభ్యులు కాస్తయినా మర్యాదగా వ్యవహరించాలని ప్రణబ్ విజ్ఞప్తి చేశారు. వ్యక్తులుగా కాకపోయినా సభ సభ్యులుగా హుందాగా ఉండాలన్నారు. పార్లమెంటు గౌరవాన్ని గుర్తుంచుకుని మెలగాలని హితవు పలికారు. ఉత్తమ పార్లమెంటేరియన్లకు అవార్డులు ఇచ్చే కార్యక్రమంలో రాష్ర్టపతి పాల్గొన్నారు. ఈ సందర్బంగా పార్లమెంటు గౌరవ మర్యాదలు, సభ ప్రాముఖ్యతను వివరించారు. అలాగే కొందరు సభ్యులు ప్రవర్తిస్తున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. "దయచేసి... మీకు పుణ్యం ఉంటుంది, పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు సభ గౌరవ మర్యాదలను కాస్తంతైనా కాపాడండి. ఇది మీరు తప్ప ఇంకెవరూ చేయలేరు" అని రాష్ర్టపతి విజ్ఞప్తి చేశారు. తొలిసారి పార్లమెంటు భవనంలోకి ప్రవేశించినప్పుడు ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటు మెట్ల మీద శిరస్సు వంచి ప్రణమిల్లడం తన గుండెను తాకిందని రాష్ట్రపతి చెప్పారు. ప్రజాస్వామ్య దేవాలయానికి ఉన్న పవిత్రతకు ఇది నిదర్శనమన్నారు. అలాంటి సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉందన్నారు. ప్రణబ్ హితబోధతో అయినా సభ్యులు మారుతారో.. లేక దున్నపోతు మీద వాన పడిన చందంలా దులిపేసుకుంటారో సభలో చూడాలి
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more