(Image source from: BBMP spent 2 lakhs for trapping the 20 rats)
‘‘దొరికింది దోచుకో... దోచుకుంది దాచుకో’’ అనే మాటకు రూపకల్పనగా మారిపోయారు ప్రభుత్వ అధికారులు. ఇందుకు నిదర్శనంగా తాజాగా బృహత్ బెంగుళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) చేసిన నిర్వాకం. బెంగుళూరులో వున్న పలు కార్యాలయాల్లో విధులకు ఆటంకం కలిగిస్తున్న ఎలుకలను పట్టుకునేందుకు బీబీఎంపీ నడం బిగించింది. అయితే వచ్చిందే అదునుగా భావించిన వీరు... ఎలుకలను పట్టుకోవడానికి దాదాపు 2 లక్షల వరకు ఖర్చు చేసి పారేశారు. ఒక్కొక్క ఎలుకను పట్టుకోవడానికి రూ.10,000 అవుతుందని నిస్సిగ్గుగా వారు చెబుతున్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో వున్న ఫైళ్లను ఎలుకలు నిత్యం తినేస్తున్నాయి... ఫళ్ల కండిషన్ చాలా దారుణంగా వున్నాయని ప్రతీసారి సమాధానం ఇవ్వడంతో అందుకు విసుగు చెందిన యెడియూరు కౌన్సిలర్ ఒక పిటిషన్ దాఖలు చేశారు. అందులో బీబీఎంపీ ఇచ్చిన సమాధానానికి అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. దరఖాస్తుదారుడు అడిగిన సమయంలో ఎన్ఆర్ స్క్వేర్ లోని బీబీఎంపీ, హెడ్ ఆఫీస్ తోపాటు మల్లేశ్వరంలోని ఐపీపీ బిల్డింగ్ లో ఎలుకల్ని పట్టుకోవడానికి మొత్తం 2 లక్షల రూపాయలు ఖర్చయిందని తెలిపింది.
ఇక్కడివరకు బాగానే వుంది కానీ... వీళ్లు మొత్తం ఎన్ని ఎలుకలు పట్టుకున్నారా అని ఆరా తీస్తే.. కేవలం 20 మాత్రం అని వెల్లడించారు. వాటిని పట్టుకోవడానికే వీరికి చుక్కలు కనిపించాయని గొప్పలు కూడా చెప్పుకున్నారట! ఈ మాట విన్న బెంగుళూరువాసులు కొంతమంది కోమాలోకి వెళ్లిపోయే పరిస్థితికి వెళ్లిపోయారు. బీబీఎంపీ ఇంత దారుణంగా సమాధానం ఇవ్వడం చూసి అందరూ చీవాట్లు వేశారు. మరోవైపు ఆఫీసు మరమ్మత్తుల కోసం కోటి 41 లక్షల నిధులు తీసుకున్న బీబీఎంపీ.. అవి కొన్ని నెలలకే తిరిగి యథాస్థితికి చేరినట్లు సమాచారం. ఇదీ బీబీఎంపీ చేసిన అసలు నిర్వాకం. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది కాకుండా... బీబీఎంపీ గొప్పలు చెప్పుకోవడంలో నెంబర్ అని అందరూ సెటైర్లు వేసుకుంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more