(Image source from: telangana government siezed filmnagar 20 acres land)
తెలంగాణ అక్రమంగా నిర్మించిన కట్టడాలను, స్వాధీనం చేసుకున్న భూముల సేకరణ విషయాలపై దర్యాప్తు మరింత వేగంగా జరుపుతున్నట్టు తెలుస్తోంది. మొన్నటికి మొన్న అయ్యప్ప సొసైటీ, గురుకుల్ ట్రస్ట్ భవనాలపై కన్నెర్ర చేసిన కేసీఆర్ ప్రభుత్వం... ఇప్పుడు తాజాగా ఫిలింనగర్ లో చలనచిత్ర అభివృద్ధి సంస్థ అయిన ఎప్ డీసీకి గట్టి షాకిచ్చింది. ఈ సంస్థకు కేటాయించిన 16.48 ఎకరాల భూమిని తెలంగాణ సర్కారు వెనక్కు తీసుకుంది.
చలనచిత్ర అభివృద్ధి కోసం మూడు దశాబ్దాల కిందట భూమి కేటాయించినా.. దానిని ఉపయోగించుకోకుండా అలాగే ఖాళీగా వదిలేయడంతో తెలంగాణ సర్కార్ ఎఫ్ డీసీకి షాకిస్తూ ఆ భూముల్ని వెనక్కు తీసుకుంది. ఇందుకు సంబంధించి శుక్రవారంరోజు సీసీఎల్ఏ సిన్హా ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మరో నాలుగు ఎకరాల్లో వున్న ఆక్రమణలను తొలగించాలని వారికి ఆదేశాలిచ్చారు.
దీనిపై స్పందించిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎంకే మీనా.... తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలతో క్షేత్రస్థాయి సిబ్బంది రంగంలోకి దిగింది. ఎఫ్ డీసీకి కేటాయించిన భూముల చుట్టూ ‘‘ఈ స్థలం ప్రభుత్వానిది’’ అని బోర్డులు కూడా వేయించిపారేశారు. ఎఫ్ డీసీ నుంచి వెనక్కు తీసుకున్న 16 ఎరకాల భూమిలో 3 ఎకరాలను ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఇవ్వాలని వాణిజ్య పన్నుల శాఖ ఇప్పటికే నిర్ణయించారు.
గతంలో మద్రాసులో వున్న తెలుగు చలనచిత్రపరిశ్రమను హైదరాబాదుకు రప్పించడం కోసం... అప్పటి ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు చేస్తూ.. భూములను కూడా కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే ఎఫ్ డీసీ సంస్థకు ఫిలింనగర్ లో వున్న 50 ఎకరాల భూమిని కేటాయించింది. అప్పట్లో ఎకరాకు కేవలం 8,500 రూపాయలు మాత్రమే వసూలు చేశారు. ఈ 50 ఎకరాల్లో 9.5 ఎకరాలు పద్మాలయ స్టూడియోస్ కు, 5 ఎకరాలు సురేష్ ప్రొడక్షన్స్ కు, 5 ఎకరాలు ఆనంద్ సినీ సర్వీసెస్ కు, మరో 10 ఎకరాల భూమిని హౌసింగ్ బోర్డుకు కేటాయించారు.
ఇక మిగిలిన 20 ఎకరాల భూమిని అలాగే ఖాళీగా వుంచేసింది. దీనిపై 2013లో హైదరాబాద్ జిల్లా యంత్రాంగం ‘‘మిగిలిన 20 ఎకరాల భూమిని రక్షించుకుంటారా? లేక మేం స్వాధీనం చేసుకోవాలా’’ అంటూ నోటీసులు కూడా ఇచ్చింది. అయినా ఎఫ్ డీసీ అధికారులు ఆ నోటీసులను అస్సలు పట్టించుకోలేదు. తరువాత ఏడాది కిందట ల్యాండ్ ఆడిట్ చేయడంతో ఎప్ డీసీ నిర్వాకం బయటపడింది. దాంతో ఎఫ్ డీసీకి కేటాయించిన భూములను రద్దు చేసి, వెంటనే స్వాధీనం చేసుకోవాల్సిందిగా అనుమతించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎంకే మీనా జూన్ నెలలో 21, 27వ తేదీల్లో సీసీఎల్ఏకు లేఖ రాశారు.
ఈ లేఖను పరిశీలించిన అనంతరం బుధవారం ల్యాండ్ మేనేజ్ మెంట్ అథారిటీ (ఎల్ఎంఏ) సమావేశంలో భూములను స్వాధీనం పర్చుకునే విషయం గురించి చర్చలు కొనసాగించారు. అనంతరం భూములను వెనక్కు తీసుకోవాలని కలెక్టర్ కు సిఫారసు చేశారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more