పోలీస్ రిక్రూట్మెంట్ లో చనిపోయిన వారి విషయంలో ఆ ఉదంతాన్ని సుమోటోగా స్వీకరించిన బోంబే హైకోర్ట్ మహారాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర హో మంత్రిత్వ శాఖకు, రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ కి నోటీసులు జారీచేసి జూన్ 23 వరకు సమాధానమివ్వవలసిందిగా ఆదేశించింది. ఆరోజు దీని మీద విచారణ జరుగుతుంది.
పోలీస్ రిక్రూట్ మెంట్ లో ప్రతిసారి ప్రతి చోట అభ్యర్థులు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు జరుగుతూనేవున్నాయి. వాటి గాంభీర్యత అధికారులకు ఎంత మాత్రం పట్టినట్టుగా కనిపించదు. పోలీస్ రిక్రూట్ మెంటుకి వచ్చే అభ్యర్థులను కేవలం జల్లెడ పట్టటం కోసమే కష్టతరమైన పోటీలు నిర్వహించటం జరుగుతుంది. అవి నిజంగా వారి ఉద్యోగ ధర్మంలో పనికివస్తాయా? ఐదు కిలోమీటర్ల దూరం పోలీసులు పరిగెత్త వలసిన అవసరం పడుతుందా నిజంగా? వాహనాలు, ఫోన్లు ఉన్న ఈ కాలంలో నేరస్తులను పట్టుకోవటం కోసం అంత దూరం పరిగెత్తే సామర్థం కలిగివుండటం అవసరమా? ఉద్యోగం లో చేరిన తర్వాత ఆ సామర్థాన్ని కాపాడుకోవటానికి అవసరమైన వ్యాయామానికి వాళ్ళకి సమయం ఉంటుందా?
కేవలం ఉపాధి కోసం వచ్చిన యువత ఎక్కువగా రన్నింగ్ లోనే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పోయిన సారి నలుగురు యువకులు మహారాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ లో గుండెపోటుతో మరణించారు. ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది.
ఆల్ మహారాష్ట్ర హ్యూమన్ రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ కి చెందిన జయేష్ మిరాని ఈ విషయంలో హైకోర్టు కి లేఖరాసామని, అది చూసిన హైకోర్టు ఈ కేసును సుమోటో గా స్వీకరించిందని తెలియజేసారు. రన్నింగ్ చేసే ప్రాంతం ఎగుడుదిగుడుగా ఉంటుందని, మంచి నీరు కాని వైద్య చికిత్సకు తగు ఏర్పాట్లు కాని సరిగ్గా ఉండవని మిరానీ అన్నారు.
అసలు హోం మినిస్టర్ పరిగెత్త గలడా 5 కిలోమీటర్లు అని అడిగారు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more