కృష్ణుడికి అష్ట భార్యలైతే తమిళనాడులోని ఒక రసిక శిఖామణికి 27 మంది ప్రియురాళ్ళు. అయితే అదంతా ఒకవైపు ప్రేమే- అది ఆడవాళ్ల వైపు నుంచే. ఈ రసికుడికి ప్రేమా దోమా అనేవి పట్టవు- కానీ, వలవేసేది మాత్రం ఇతనే. ప్రేమ ముగ్గులోకి ఆడపిల్లలను దించేది ఇతనే- కానీ, ఇతను మాత్రం ప్రేమకు చాలా దూరం.
అలాగని శృంగారానికి దూరంగా ఏమీ ఉండడు. తన కోరికా తీర్చుకుంటాడు, వాళ్ళ వీడియోలను సిడిలు గా అమ్ముకుని సొమ్మూ చేసుకుంటాడు.
సోమవారం ఇతని బండారం ఈ విధంగా బయటపడింది-
బెన్సిఫి అనే 21 సంవత్సరాల యువకుడి ప్రేమలో మధురై జిల్లా లో అనైయూర్ ముడకత్తాన్ రోడ్ కి చెందిన 24 ఏళ్ళ యువతి రెజీనా బోర్లా పడింది. అతని నివాసానికి పోయి మోసపోయింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చెయ్యటంతో అసలు విషయమంతా బయటపడింది.
మాసిలామణిపురం, శ్రీనగర్ లో నివాసముంటున్న బెన్సిఫి ఒంటరిగానే ఉంటున్నాడు. అతని ఇంటికి అతని స్నేహితులు తప్ప మరెవరూ బంధువులు రారు. అతని తల్లి బెన్సిఫి కి నెల ఖర్చులకోసం రూ.50000 ఇస్తుంది. దానితో అతను బైక్ మీద తిరుగుతూ ఆడపిల్లలనే కాకుండా వివాహమైన మహిళలను కూడా బుట్టలో వేసుకోవటం చేసాడు. ఇప్పటి వరకు ఇతని బారిన 27 మంది ఆడవాళ్ళు పడ్డారని తెలిసింది.
ఇతను ముందు వాళ్ళతో ప్రేమగా నటించి, వాళ్ళకి బాగా నమ్మకం కలిగించి తన నివాసానికి పిలుస్తాడు. వాళ్ళు అక్కడ ఇతను మత్తు మందు కలిపిచ్చిన పానీయాన్ని సేవించి ఆదమరచి నిద్రపోతారు. వాళ్ళ నగ్న ఛాయాచిత్రాలను సిడి లోకి ఎక్కించి ఇతను వేరే ప్రాంతాల్లో అమ్ముతుంటాడు. ఇదే ఇతని వృత్తి అయిపోయింది, అందులో ఇతను బాగా రాటుతేలాడు కూడా. కాలేజ్ లో చదివే ఆడపిల్లలే కాకుండా మహిళలు సైతం ఇతని మోసానికి బలయ్యారు. ఇదంతా పోలీసు దర్యాప్తులో తేలిన విషయాలు.
తన మీద ఏడు సెక్షన్ల కింద కేసు నమోదైన విషయం తెలిసిన బెన్సిఫి మకాం మార్చి సేలం వెళ్ళిపోయాడు. కానీ పోలీసులు అతన్ని తమకున్న అనుభవంతో ఎంతో సులభంగా పట్టుకున్నారు. బెన్సిఫి తల్లి హేమమాలిని, ఇతనికి మద్దతుగా పనిచేసే బంధువు రాజాల మీద పోలీసులు కేసులు నమోదుచేసారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more