Mallikarjun kharge comments on bjp leaders

mallikarjun kharge comments on bjp, mallikarjun kharge comments on bjp leaders, Lok Sabha, Mallikarjun Kharge.

mallikarjun kharge comments on bjp leaders

మేం కాంగ్రెస్ ఎంపీలం కాదు!.. పాండవులం

Posted: 06/10/2014 03:15 PM IST
Mallikarjun kharge comments on bjp leaders

కాంగ్రెస్ పార్టీ ఎంపీలు .. ఎంపీలు కాదట. వారు పాండవులని ఆ పార్టీ విపక్ష నేత మల్లికార్జన ఖర్గే చెబుతున్నారు. ఇందుకు పురాణ గాథ మహాభారతాన్ని ఉదాహరణగా తీసుకుని తన విశ్లేషణ తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో మాట్లాడుతున్న ఖర్గే, ముగింపు సమయంలో... 'లోక్ సభలో మేము (కాంగ్రెస్) 44 మంది ఎంపీలు ఉండవచ్చు. కానీ, పాండవులెప్పుడూ వందమంది కౌరవుల ముందు భయపడలేదు' అని తెలిపారు.

బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూఢీ వ్యాఖ్యలను తిప్పికొట్టే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలను పాండవులతో పోల్చుకున్నారు లోక్ సభలో ఆ పార్టీ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే. అంతకుముందు సభలో తొలుత మాట్లాడిన రాజీవ్ ప్రతాప్ రూఢీ, 2014 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఎన్డీఏకు ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కూడా లేదన్నారు. దాంతో, తమ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఎవరిని ఎలా సంప్రదించాలో తెలియడంలేదని వ్యాఖ్యానించారు.

కానీ, బాధపడాల్సిన అవసరంలేదని... తాము ప్రతి ఒక్కరిని సంప్రదిస్తామని, ఎందుకంటే తమ ప్రధాని (మోడీ) విశాల హృదయం కలవారని పేర్కొన్నారు. అంటే ఒకరకంగా చెప్పాలంటే.. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ని కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. బిజెపిని కౌరవసేనగా పోల్చిన మల్లికార్జున ఖార్గే .. అదే తీరులో మోడీని దుర్యోధనుడని పైకి అనకుండా అనేశారు. ఈ విషయం అర్థంకానీ బీజేపి నాయకులు మైకుల ముందు గోల గోల చేయటం జరిగింది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles