ఈ నెల 22 న ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ నిజాం కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఆ సభలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు.
పవర్ స్టార్ గా సినీ అభిమానుల మన్ననలందుకున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి, తాను ప్రకటించినట్లుగానే తర్వాత ఎన్నికలలో నిలబడటం లేదు, తాను సరైన అభ్యర్థులనుకున్నవాళ్ళకు మద్దతునిస్తున్నారు. నరేంద్ర మోదీని కలిసి మద్దతు తెలిపిన తర్వాత భాజపా తరఫున ఆయన కర్నాటకలో ఎన్నికల ప్రచారానికి ఆఖరు రోజున బహిరంగ సభలలో పాల్గొన్నారు.
ఈ రోజు భాజపా సీనియర్ నేత బండారు దత్తాత్రేయ పవన్ కళ్యాణ్ తో భేటీలో భారతీయ జనతా పార్టీ తరఫున సికింద్రాబాద్ లో ఎన్నికల ప్రచారానికి మాటిచ్చినట్లుగా సమాచారం. అయితే మోదీ సభ తర్వాత ప్రచారం విషయంలో వివరంగా కార్యక్రమాన్ని రూపొందించటానికి పవన్ కళ్యాణ్ సిద్ధపడ్డారని దత్తాత్రేయ తెలియజేసారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more