ఎమ్మెల్యేలు, ఎంపీల మీద కేసుల విచారణను సంవత్సరకాలంలో ముగించాలంటూ సుప్రీం కోర్టు ఈరోజు అన్ని ట్రయల్ కోర్టు లకూ ఆదేశాలను పంపించింది. ఒకవేళ అలా చెయ్యలేని పక్షంలో ట్రయల్ కోర్టులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందుకు వివరణనియ్యవలసివుంటుందని కూడా హెచ్చరించింది సుప్రీం కోర్టు.
ఒక ఎన్జీవో వేసిన పిటిషన్ కు స్పందనగా, ఆర్ పి ఏ సెక్షన్ 8(1), 8(2), 8(3) ల ప్రకారం ప్రజాప్రతినిధుల మీదున్న కేసులను ట్రయల్ కోర్టులు సంవత్సరకాలంలోనే ముగించవలసివుంటుందని ఎపెక్స్ కోర్టు తెలియజేసింది.
జూలై 2013 లో సుప్రీం కోర్టు ప్రజాప్రతినిధులకు ఉన్న న్యాయపరమైన మినహాయింపును రద్దు చేస్తూ ఎన్నికల రాజకీయాల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. దానికి కొనసాగింపుగా, ప్రజాప్రతినిధుల మీద కేసులను ఎక్కువ కాలం సాగతీయకుండా కూడా సుప్రీం కోర్టు ఈ ఆదేశం ద్వారా నిలువరించింది.
పైన పేర్కొన్న సెక్షన్లలో ప్రజాప్రతినిధులు జాతీయ పతాకాన్ని అవమానపరచటం, వర్గాల మధ్య విభేదాలను సృష్టించే ప్రయత్న చెయ్యటం, నిత్యావసర వస్తువులను అక్రమంగా నిలవచెయ్యటం లాంటి నేరాలున్నాయి. అయితే సెక్షన్ 8(4)లో నేరం మోపబడ్డ ప్రజాప్రతినిధులు దానిమీద కోర్టులో విచారణ కొనసాగుతున్నంత కాలం తమ పదవిలో కొనసాగవచ్చని ఉంది. అందువలన అది కూడా సాగనివ్వకూడదన్న ఉద్దేశ్యంతో సుప్రీం కోర్టు ఆర్ పి ఏ చట్టాన్ని ప్రజా ప్రయోజనంలో మరింత పటిష్టం చేసింది.
ఇప్పటికే ఈ కేసులో మాజీ బీహార్ ముఖ్యమంత్రి ఆర్ జె డి పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, ఇతర ఎంపీలు ఈ చట్టం కింద జైలు శిక్ష అనుభవిస్తున్నారు. మన రాష్ట్రంలో కేసులు పెండింగ్ లో ఉన్నవి ఒక్క వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్ మీదనే.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more