అమెరికాలో పనిచేస్తున్న భారత్ దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగడె మీద వీసా నియమాలను ఉల్లంఘించిన కేసుని పెట్టి అత్యుత్సాహం చూపించి ఆమెనే కాక యావద్భారతావనిని అగౌరవపరచిన అమెరికా ప్రభుత్వానికి భారత ప్రభుత్వం కోరినట్లుగా బేషరతుగా క్షమాపణ చెప్పటానికి ముఖం చెల్లకపోయినా దౌత్యవేత్తలు లభించే ఇమ్యూనిటీని ఇస్తూ యుఎస్ ని విడిచి పొమ్మని ఆదేశించటం జరిగింది.
దేవయాని మీద తప్పు కేసుని బనాయించి వేధించారంటూ ఆమె తరఫున వాదిస్తున్న అడ్వకేట్ డేనియల్ అర్షాక్ అన్నారు. యుఎస్ అటర్నీ ప్రీత్ భరారా మోపిన కేసు నిరాధారమైనదని తప్పుల తడకని ఆయన అన్నారు.
ఖోబ్రాగడెకి గల పూర్తి ఇమ్యూనిటీని అంగీకరిస్తూ, భారత్ ఆమెకు అందించిన ఇమ్యూనిటీని ఉపసంహరించుకోవటానికి అంగీకరించకపోవటం వలన ఆమె అమెరికా దేశాన్ని వదిలిపెట్టి పోవలసిందిగా స్టేట్ డిపార్ట్ మెంటు కోరింది.
అదే మన దేశంలో జరిగితే ప్రధాన మంత్రి దగ్గర్నుంచి ప్రతి మంత్రీ జరిగిన దానికి పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చుతూ క్షమాపణ కోరేవారే. ప్రీత్ భరారా చేసింది తప్పని, ఆయన తప్పుడు కేసుని పెట్టారన్న విషయం ప్రోసిక్యూటర్ కార్యాలయానికి క్షుణ్ణంగా తెలుసంటూ డేనియల్ అర్షాక్ ఆరోపించారు. అంతే కాదు ప్రీత్ భరారా చేసిన పొరపాటుతో తనకు తక్కువ భత్యమిస్తున్నారని దేవయాని మీద అభియోగాన్ని మోపిన సంగీతా రిచర్డ్ కుటుంబం ఇంచక్కా అమెరికాలో శాశ్వత పౌరసత్వాన్ని పొందటం కూడా జరిగిందని అర్షాక్ అన్నారు.
ఖోబ్రాగడె గురువారం సాయంత్రం అమెరికా నుండి భారత్ కి వెళ్ళవలసివుంది. దానివలన ప్రోసిక్యూటర్ కోర్టుకి ప్రాథమిక విచారణ కోసం రాసిన లేఖలో ఆమె బహుశా ఇండియా వెళ్ళిపోయారని కూడా రాసారు. కానీ ఆమె అక్కడే మన్హట్టన్ లోనే ఉన్నారంటూ అర్షాక్ తెలియజేసారు.
తప్పులెవరైనా చెయ్యవచ్చు కానీ తన తప్పు తాను తెలుసుకున్నప్పుడు దాన్ని ఒప్పుకునే ధైర్యం కూడా ఉండాలి. అది లేని అమెరికా ఇంకా తన ముఖం చాటేసుకుంటూ తప్పు మార్గాలనే వెదుకుతోందని దీనితో అర్థమౌతోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more