Erasu pratap reddy fire on ap bifurcation

erasu pratap reddy fire on ap bifurcation , Minister Erasu Pratap Reddy fires on Sonia, Botsa Satyanarayana, GOM Changes Bifurcation

erasu pratap reddy fire on ap bifurcation, Minister Erasu Pratap Reddy fires on Sonia

నాకు మండితే ఏమైనా మాట్లాడుతాను: మంత్రి

Posted: 11/29/2013 06:45 PM IST
Erasu pratap reddy fire on ap bifurcation

నాకు మండితే ఏమైనా మాట్లాడతాను అని సినిమా హీరో చెప్పినట్లు డైలాగు చెప్పారు కాంగ్రెస్ పార్టీ న్యాయశాఖ మంత్రి ఎరాసు ప్రతాపరెడ్డి. రాష్ట్ర విభజన పై కేంద్రం తుపాన్ వేగంతో దూసుకుపోతుంది. దీంతో సీమాంద్ర కాంగ్రెస్ నాయకులు మూడు వర్గాలు విడిపోయారు. ఒక వర్గం వారు.. హైదరాబాద్ ను యూటి చేస్తే.. తెలంగాణాకు మేము మద్దతు ఇస్తామని అంటున్నారు. మరొక వర్గం వర్గం వారు రాయల్ తెలంగాణ కావాలని డిమాండ్ చేస్తున్నారు. మిగిలిన మూడో వర్గం వారు సమైక్యాంద్ర కోసం పోరాటం చేస్తున్నారు.

 

అయితే ఈరోజు ఏరాసు ప్రతాప్ రెడ్డి రాష్ట్ర విభజన పై తీవ్రంగా మండపడ్డారు. అంతేకాకుండా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సహా మంత్రులుగా తాము మాట్లాడామని ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. నాకు మండితే ఏం చేస్తానో నాకే తెలియాదు అన్నారు. ఎవరిపై చర్యలు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. కడుపు మండితే ఏమైనా మాట్లాడుతామని అన్నారు. రాష్ట్ర విభజనలో సాంప్రదాయాలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. విభజనకు అసెంబ్లీ తీర్మానం కోరాలన్నారు.

 

శీతకాల సమావేశాల్లో పార్లమెంట్‌కు తెలంగాణ బిల్లు రాదని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని హడావిడిగా విభజించాలని చూస్తే మరిన్ని తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతాయని ఏరాసు ప్రతాప్ రెడ్డి అంతకుముందు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని విభజించి తెలుగు ప్రజలు కొట్టుకొవాలని చూస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉందని ఆయన మండిపడ్డారు. శ్రీశైలం,నాగార్జున సాగర్ ప్రాజెక్టులు పరిష్కరించకపోతే భవిష్యత్తులో విభేదాలు తలెత్తుతాయని పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజలను సంతృప్తి పరచకుండా విభజించడం సరికాదని అభిప్రాయపడ్డారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles