ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలంగాణ కాంగ్రెస్ నేతలను 2014 ఎన్నికల కోసం పురమాయిస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఆయన్ను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యనేతలతో తెలంగాణ రాష్ట్రం పై అభయాన్ని ఇచ్చారు.
కాంగ్రెస్ తెలంగాణ విషయంలో వెనకడుగు వేయట్లేయని, రాష్ట్ర విభజన విషయంలో ముందుకే తప్ప వెనక్కి వెళ్ళేది లేదని, కాంగ్రెస్ ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక అందులో ఎలాంటి సందేహాలు లేవని, నవంబర్ 15 నాటికి ముసాయిదా బిల్లు రెడీ చేసి, వచ్చే నెలలోనే రాష్ట్ర శాసనసభ అభిప్రాయాన్ని సేకరించే పనిలో కాంగ్రెస్ కేంద్ర పెద్దలు ఉన్నారని నవంబర్ నెలాఖరున అసెంబ్లీని సమావేశపరిచి సభ్యుల అభిప్రాయాలు తీసుకొని ఎలాంటి జాప్యంలేకుండా ముసాయిదా బిల్లు రూపకల్పనకు కేంద్రం కసరత్తు చేస్తోందని నవంబర్ 15 నాటికే ముసాయిదా బిల్లును పూర్తిచేయించే పనిలో ఉన్నట్లు దిగ్విజయ్ సింగ్ తెలిపారు.
ఆ తరువాత రాష్ట్రపతికి పంపాలని, దానిపై నవంబర్ నెలాఖరులోగా అసెంబ్లీనుంచి అభిప్రాయ సేకరణను పూర్తి చేయించి, బిల్లును డిసెంబర్లో జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టేలా కసరత్తు సాగుతున్నట్టు తెలంగాణ నేతలకు ఆయన సూచించినట్లు సమాచారం వస్తోంది. కొత్త ఏడాది నాటికి రెండు రాష్ట్రాలు ఏర్పడతాయని,.దీనిపై ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
విభజనపై మేం వెనక్కు పోయామని, సందిగ్ధంలో పడ్డామని ఎవరైనా అంటే నమ్మొద్దు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీయే ఇచ్చిందని ప్రజలకు వివరించండి. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చామని వివరించండి. భారీ స్థాయిలో సమావేశాలు నిర్వహించండి. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజల్లోకి తీసుకువెళ్లండి అని దిగ్విజయ్ పేర్కొన్నారు తెలంగాఱ రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సూచించినట్లు తెలుస్తుంది. డిగ్గీరాజా హామీతో తెలంగాణ నాయకుల్లో మరింత ఉత్సాహం కలిగిందని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more