శుక్రవారం సాయంత్రం దిగ్విజయ్ సింగ్ ఢిల్లీలో మీడియా ముందు మరో సంచలన వ్యాఖ్య చేసారు- ఆంటోనీ కమిటీకి ఇదమిద్ధంగా ఇంత సమయం అంటూ నిర్ధారణగా లేదని.
రాష్ట్ర విభజన మీద సిడబ్లుసి తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించగానే ఉవ్వెత్తుగా లేచిన సీమాంధ్ర ఆందోళనల నేపథ్యంలో పరిస్థితులను సమీకరించటానికి కేంద్రం నలుగురు సభ్యుల కమిటీని ఒకదాన్ని రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ నేతృత్వంలో ఏర్పాటు చేసింది.
అందులో ఒక సభ్యుడైన కాంగ్రెస్ పార్టీ ఛీఫ్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ని పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణని కమిటీ ముందుకి రాదలచుకున్నవాళ్ళ జాబితాను తయారు చెయ్యమని చెప్పానన్నారు. ఆంటోనీ ఎన్నో కీలకమైన వ్యవహారాలను చక్కబెడుతూ పనులలో వ్యస్తులైవుంటారు కాబట్టి ఆయనకు అనుకూలమైన సమయాన్ని కేటాయించి రాష్ట్రం నుంచి విభజన విషయంలో వచ్చే ఫిర్యాదులను సూచనలను వినటం జరుగుతుందని అన్నారు.
మరి ఇదంతా ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పటికి పూర్తవుతుంది అని అడిగిని ప్రశ్నకు, చెప్పలేం, ఆంటోనీ చాలా బిజీగా ఉంటారు. పార్లమెంటు వ్యవహారాలు ఇంకా ఎన్నో ఉన్నాయి కనుక ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేం, అలాగే కమిటీకి టైం లిమిటనేది లేదు కాబట్టి ఎప్పటి వరకు సాగుతుందో కూడా చెప్పలేమన్న సంకేతాన్నిచ్చారు దిగ్విజయ్ సింగ్.
నిన్న మరో సందర్భంలో మాట్లాడుతూ, కమిటీ అనేది ఉన్నది సమస్యలను పరిష్కరించుకోవటానికే అంతే కానీ తెలంగాణా విషయంలో సిడబ్లుసి నిర్ణయం జరిగిపోయింది కాబట్టి దాన్ని ఉపసంహరించుకోవటానికి ఏర్పాటైన కమిటీ కాదని స్పష్టంచేసారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more