2nd phase of ap panchayat polls begins

Andhra Pradesh, AP Panchayat elections, 2nd phase of AP panchayat polls begins

2nd phase of AP panchayat polls begins. ... the second phase of Gram Panchayat elections which are being held in Andhra Pradesh today.

రెండో విడత పోలింగ్ ప్రారంభం

Posted: 07/27/2013 08:03 AM IST
2nd phase of ap panchayat polls begins

పంచాయితీ ఎన్నికలలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ ప్రారంభం అయింది. రెండో విడతలో 6971 పంచాయితీలకు ఈరోజు పోలింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. మొదట వార్డు నెంబర్ల లెక్కింపు, తరువాత సర్పంచి లెక్కింపు ఉంటుంది. ఈ ఫలితాలు సాయంత్రం 5 గంటల వరకు వెలివడే అవకాశం ఉంది. రెండో విడత పోలింగ్ సందర్భంగా పోలీసులు భారీ బందోస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు చేపట్టారు. ఓటర్లు ఇప్పటికే భారీగా పోలింగ్ కేంద్రాల వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారు తీరారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని పంచాయితీల ఓటర్లు పోలింగ్ వద్ద క్యూ కట్టారు.  గుంటూరు జిల్లాలో పోలింగ్ కి ముందే రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు లాఠీ ఛార్జి చేసి చెదరగొట్టారు. తొలి విడతలో తెలుగు దేశం హవా కొనసాగింది. నేడు ఎవరి హవా కొనసాగుతుందో చూడాలి. పోటీ దారులు ఓటర్లను పోలింగ్ కేంద్రాల వద్దకు తరలించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles