రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారికి రెండు కోట్లు నష్టం సంభవించింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్ వద్ద గల్లా ఫుడ్స్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 800 టన్నుల మామిడి కాయలు అగ్నికి ఆహుతి అయ్యాయి. షార్ట్ సర్క్యూట్ తో ఓ షెడ్డుకు మంటలు అంటుకోగా, పక్కనే మామిడి కాయలు నిల్వ ఉంచిన షెడ్డుకు కూడా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న చిత్తూరు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రెండు కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు ఫ్యాక్టరీ యాజమాన్యం తెలిపింది. అయితే అధికారికంగా సుమారు కోటి ఆస్తినష్టం జరిగినట్లు అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు. మంత్రి గల్లా అరుణకుమారి కుటుంబానికి చెందిన గల్లా ఫుడ్స్ ఫ్యాక్టరీలో మామిడి , ఆపిల్తో పళ్ల రసాలు తయారు అవుతాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more