కర్ణాటక రాజకీయ గాలి కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా వీచింది. అధికారంలో ఉన్న బిజేపి పార్టీకి ప్రజల్లో వ్యతిరేకత వచ్చి, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారింది. గడిచినఐదేళ్లలో మూడు సార్లు ముఖ్యమంత్రులను మార్చడం, యడ్యూరప్ప అవినీతి మరకలు పార్టీని కుదిపేయడం లాంటి అంశాలు కాంగ్రెస్ కు కలిసి వచ్చాయి. బిజేపి అగ్రనేతల ప్రచారం చేసినప్పటికి కర్ణాటక ప్రజలు తీర్పు మరోలా ఉంది. అయితే కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాత్రం ఇప్పుడు గోప్పులు చెప్పుకుంటున్నారు. ఈ విజయం మేము ముందే ఊహించమాని చంకలు కొట్టుకుంటున్నారు. కర్ణాటక రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ముందే ఊహించానని కేంద్ర హోం మంత్రి షిండే తెలిపారు. ఫలితాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
బిజెపి చెప్పిన మాటలను కర్నాటక రాష్ట్ర ప్రజలు నమ్మలేదని, అందుకే కాంగ్రెస్ కు పట్టం కట్టారని అన్నారు. కానీ అసలు విషయం మరిచిపోయారని బిజేపి నాయకులు అంటున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ప్రధానం గా బలమైన పార్టీలు రెండే ఉన్నాయి. ఒకటి బిజేపి, రెండు కాంగ్రెస్. ఇక ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికి వాటిపై ప్రజలు అంతగా ఆశక్తి చూపలేదు. కానీ బిజేపిని కాదంటే..తప్పనిసరిగా కాంగ్రెస్ కే ఓటు వెయ్యాలి. కాబట్టి అలా కాంగ్రెస్ గెలిచిందని బిజేపి సీనియర్ నాయకులు అంటున్నారు. ఏమైన కాంగ్రెస్ పార్టీకి ఇది విజయమేనని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more