రాజకీయాలలో ఎవరి గురించి వారు చెప్పుకోవటం సహజమే. వారి గొప్పతనాలు, ఆశయాలు, చేసినవి, చెయ్యబోయేవి చెప్పటం వరకూ బాగానే వుంటుంది. ఏమీ చెప్పకపోతే ఎవరికేం తెలుస్తుంది మరి. తద్వారా మేము ఇంతటి ఘనులం, ఇంత మంచి వాళ్లం, ఇంతలేసి పనులు చెయ్యగలిగినవాళ్ళం కాబట్టి ఇకముందు కూడా చేస్తామని నమ్మకం పెట్టుకుని అధికారాలను మాకే కట్టబెడితే అందులోనే మీ సక్షేమం, సౌభాగ్యాలు దాగి ఉన్నాయి సుమా అని ప్రజలకు చెప్పటాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ తన గీతను పొడిగించ కుండా పెద్దగా చెయ్యటానికి ఉన్న మరో చిట్కా పక్క గీతను చిన్నది చెయ్యటం. అప్పడు న్యూటన్ సాపేక్ష సిద్ధాంతం అమలవుతుంది. పోలికలో తనదే పెద్ద గీత అవుతుంది. ఈ సిద్ధాంతాన్ని నమ్ముకున్న నేటి రాజకీయ ప్రచారంలో ఎప్పుడూ అవతలివారిని కించ పరచటమే ధ్యేయంగా మారింది.
నవ్వడం ఒక యోగమని వైయస్ రాజశేఖర్ రెడ్డి చెప్తుండేవారు. కానీ ఆయన కుటుంబమంతా ఏడవటంలోనే యోగముందని నమ్ముతున్నట్టున్నారని తెలుగు దేశం కార్యదర్శి నన్నూరి నర్సరెడ్డి తీవ్రస్థాయిలో వ్యాఖ్యానంచేసారు. ఎప్పుడూ నవ్వు ముఖంతో కనిపించే వైయస్ ఆర్ నవ్వు వెనక విషం ఉండేది. ఇప్పుడు ఆయన కుటుంబం ఏడుపు వెనక విషం ఉంది అని కూడా ఆయన విమర్శించారు. ఎందుకలా విమర్శించారూ అంటే,
చంద్రబాబు ది పాదయాత్ర కాదు పాడుయాత్ర అని వైయస్ జగన్ జైల్లోకి వెళ్ళిన తర్వాత రాజకీయాల్లో చురుగ్గా పనిచేస్తున్న వైయస్ ఆర్ కూతురు షర్మిల అనటం జరిగింది. మరి వీళ్ళు ఊరుకుంటారా వీళ్ళూ ప్రాస కలిసేట్టుగా సమాధానమిచ్చారు. ఓదార్పు పేరుతో మీ అన్న పాడె యాత్ర చేస్తే, చనిపోయిన భర్తను గుర్తు తెచ్చుకుంటూ మీ అమ్మ ఏడుపు యాత్ర చేస్తే, మీరు క్యాట్ వాక్ లు మీ భర్త అనిల్ స్టేజ్ వాక్ లు చేస్తున్నారు అంటూ నర్సరెడ్డి ఘాటుగా ప్రతివ్యాఖ్యలను చేసారు. షర్మల చేసే పాదయాత్రలో ఆమె చూపులన్నీ ఖాళీ స్థలాల మీదున్నాయని, వాటి బాపతు భోగట్టా అంతా ఆమె జైల్లో జగన్ ని చూడటానికి పోయినప్పుడల్లా అతని చెవిలో వేస్తుంటుందని, రైతులు ఆమెను తమ పొలాలకు తీసుకెళ్ళటానికి భయపడుతున్నారని, ఆమె కళ్ళు పడ్డాక అవి దక్కుతాయో లేదో అనే భయం వాళ్ళని పీడించటమే అందుకు కారణమని కూడా నర్సిరెడ్డి ధ్వజమెత్తారు
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more