Suicide bomb squad attack at peshavar pakistan

suicide squad, pakistan, peshavar, suicide attack

suicide bomb squad attack at peshavar, pakistan

suicide-squad.png

Posted: 02/18/2013 05:03 PM IST
Suicide bomb squad attack at peshavar pakistan

     ఇద్దరు వ్యక్తులతో కూడిన ఆత్మాహుతి దళం పాకిస్తాన్ లోని పెషావర్ లోని ప్రభుత్వ కార్యాలయాల మీద ఈరోజు దాడి చేసింది.   వారిద్దరూ దాడి చేస్తున్న సమయంలో ఖైబర్ హౌస్ లో రాజకీయ సమావేశాలు జరుగుతున్నాయి.  మిలిటరీ యూనిఫాంలో భద్రతా దళంలా లోపలికి ప్రవేశించిన దుండగులు కాల్పులు జరిపి ఐదుగురి ప్రాణాలు తీసారు, మరో ఎనిమిది మందిని గాయపరచారు.  ఆ తర్వాత వాళ్ళు తమను తాము బాంబులతో పేల్చివేసుకున్నారు.  అందులో ఒక వ్యక్తి సమావేశం జరుగుతున్న హాలు బయటనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. 

     ముందుగా గేటు దగ్గరున్న సెక్యూరిటీ గార్డ్ ని తుపాకీతో కాల్చి లోపలికి ప్రవేశించారు.   ఆ తర్వాత 20 నిమిషాల వరకూ కాల్పులు జరిపి చివరకు తాము ధరించిన బాంబుతో పేల్చివేసుకున్నారు.  చనిపోయినవారిలో నలుగురు భద్రతా సిబ్బంది, ఒకరు సామాన్య పౌరుడు. 

     రాబోయే ఎన్నికల నియమావళిని చర్చించుకుంటున్న తరుణంలో జరిగిన ఈ ఘటన పెషావర్ లో అత్యంత భద్రతా క్షేత్రంలో జరగటం విశేషం.  ఇంతవరకూ ఆ ఆత్మాహుతి దళం ఏ సంస్థకి చెందిందన్నది తెలియలేదు, మేమే చేసామంటూ ఎవరూ ప్రకటించలేదు కానీ బహిష్కరించబడ్డ తెహ్రిక్-ఎ-తాలిబాన్-పాకిస్తాన్ కి చెందినవారని ఊహాగానాలు వినవస్తున్నాయి. 

     సంఘటన జరిగిన స్థలానికి దగ్గర్లో జైలులో ఉన్న కొందరు ఖైదీలను విడిపించటానికే ఆ దుండగులు వచ్చుంటారు కొందరు అభిప్రాయపడుతున్నారు.  భద్రతా సిబ్బంది పరిస్థితిని నియంత్రణలోకి తీసుకుని, అక్కడి వారినందరినీ బయటకు పంపించివేసారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Supreme court gave green signal to panchayat elections
High court issued notice to ttd and state govt  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles