ముంబాయి అంత హై టెన్షన్ నెలకొంది. శివసేన అధినేత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శివసేన అధినేత బాల్ ఠాక్రే శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయనకు చికిత్స చేస్తున్న డాక్టర్ జైల్ ధ్రువీకరించారు. ఠాక్రే శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు కన్నుమూశారని వైద్యులు ప్రకటించారు. ఎనభై ఆరేళ్ల వయసు కలిగిన ఠాక్రే మహారాష్ట్రలో సంచలన కధనాయకుడు.రాజకీయాలలో ఆయన ఒక పెద్ద కెరటంగా భావించవచ్చు. మహారాష్ట్రలో బిజెపి తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం నడపడానికి కారణమైన బాల్ ఠాక్రేకి, ఆయన పార్టీ శివసేన కు ముంబైపై ఉన్న పట్టు చాలా గట్టిది. సామ్నా పత్రిక వ్యవస్థాపకుడిగా ఆయన తన అభిప్రాయాలను నిష్కరగా రాసేవారు. ప్రత్యేకించి హిందుమత పరిరక్షణకు ఆయన కంకణం కట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని వివాదాలకు కారణమైనా లక్షలాది మంది అబిమానులను ఆయన కూడగట్టుకోగలిగారు. దీంతో ముంబైవాసులే కాక, దేశవ్యాప్తంగా ఉన్న ఠాక్రే అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన కన్నుమూసిన మాతోశ్రీ వద్దకు అభిమానులు భారీగా చేరుకుంటున్నారు.
1966 జూన్ 19న శివసేన పార్టీని బాల్థాకరే స్థాపించారు. ముంబయిలో కేంద్ర బలగాలు భారీగా మోహరించారు. అధిక సంఖ్యలో ప్రజలు నాయకులు వెళుతున్నారు. ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. 1926 జనవరి 23న బాల్థాకరే జన్మించారు. బాల్థాకరే అసలు బాల్ కేశవ్ థాకరే. బాల్థాకరేకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు.బాల్థాకరే మృతితో ముంబయి మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. 1960లో కార్టూనిస్ట్గా జీవితం ప్రారంభించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన పోరాటం చేశారు. మరాఠీ ప్రజల్లో తిరుగులేని హీరోగా పేరు సంపాదించుకున్నారు. 1926 జనవరి 23న బాల్థాకరే జన్మించారు. రేపు ఉదయం 10 గంటలకు థాకరే అంతిమయాత్ర, మధ్యాహ్నం 3 గంటలకు థాకరే అంత్యక్రియలు జరుగుతాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more