నగరంలోని లక్డీకాపూల్లో ఉన్న డిజిపి కార్యాలయం ఎదుట నడిరోడ్డుపై ఆటోలో .6,70,50,000 రూపాయలను గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిపోయిన మిస్టరీ వీడింది. ఆ డబ్బుకు కేరాఫ్ అడ్రస్ బాల సాయిబాబా ట్రస్ట్గా తేలింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. డిజిపి కార్యాలయం ముందు ఆటో ఆగిపోవడంతో తనిఖీ చేసేందుకు వచ్చిన సెక్యూరిటీ సిబ్బందిని చూసి డబ్బున్న బ్యాగులను వదిలి పారిపోగా వాటిని స్వాధీనం చేసుకుని సైఫాబాద్ పోలీసులకు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే ఎందుకు ఇంత భారీ మొత్తాన్ని ఆటోలో తరలించాల్సి వచ్చింది, ఆటోలో ఉన్న వారు ఎందుకు పోలీసులను చూపి భయపడి వదిలిపోయారనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. హైదరాబాద్లోని దోమలగూడలో నివసించే కర్నూలుకు చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి, బాలసాయిబాబా ట్రస్ట్ చైర్మన్ రామారావు ఈ సొమ్ము తనదేనని పోలీసుల ముందుకు వచ్చి చెప్పడంతో అతనిని పలు కోణాల్లో విచారిస్తున్నారు. నిజంగా ఆ సొమ్ము రామారావుదే అయితే అంత భారీ మొత్తాన్ని కారులో తీసుకెళ్లాల్సి ఉండగా, ఆటోలో తరలించడం ఏమిటనేది ఇంకా స్పష్టం కాలేదు. ఈ సొమ్మంతా లెక్కల్లోకి వచ్చిన ఆదాయమా..? లేక లెక్కల్లోకి రాని ఆదాయమా..? అనేది కూడా నిర్ధారణ చేయాల్సి ఉందని చెబుతున్నారు. అన్ని ఆధారాలను పరిశీలించుకున్న తర్వాతే ఈ సొమ్ము రామారావు చెబుతున్నట్లు నిజంగా ఆయనదా కాదా అనేది కూడా తేలాల్సి ఉందని ఆయా వర్గాలు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more