తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ మేథోమధన సదస్సు కరీంనగర్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సదస్సు నేటితో ముగిసింది. ఈ ముగింపు సదస్సులో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.... తెలంగాణ ఉద్యమాన్ని గత పన్నెండేళ్ళుగా సజీవంగా నిపులుకున్నామని, దానికి మీరందరు ఇచ్చిన సహాయ సహకారాలే కారణమని అన్నారు. ఇక తెలంగాణ అంశం గత కొద్ది రోజులు శాంతించిందని, తమ గమ్యం ముద్దాడే వరకు విశ్రమించేది లేదని, ఎత్తిన జెండా దించం.. బిగించిన పిడికిలిని సడలించం అని చెప్పారు.
ఇక పార్టీ కార్యచరణ గురించి మాట్లాడుతూ.... వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో సంబంధాలు ఉండవని, కాంగ్రెస్, టీడీపీ ఒక చీడపురుగు లాంటి పార్టీలని, బీజేపీతో కలిసి పనిచేసేందుకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని ఆయన అన్నారు. సకలజనుల సమ్మె నేపథ్యంలో కొంచెం వెసులుబాటు కల్పించాలని ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ కోరారని, ఆయన కోరిక మేరకు కొంచెం శాంతించామని కేసీఆర్ తెలిపారు. కొద్ది నెలలుగా కాంగ్రెస్ అధిష్టానం తమతో చర్చలు జరుపుతోందని, ఈ నేపథ్యంలోనే ఢిల్లీ వెళ్లాల్సి వచ్చిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఎన్నోసార్లు మోసం చేసినా తర్జనా భర్జనల అనంతరం ఢిల్లీ వెళ్లాల్సి వచ్చిందని కేసీఆర్ పేర్కొన్నారు. చర్చల్లో టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలని కండిషన్ పెట్టారని, హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణ ఇస్తే పార్టీనీ విలీనం చేస్తామని ఒప్పుకున్నామని, అయినా కాంగ్రెస్ తాత్సారం చేస్తుందని కేసీఆర్ మండిపడ్డారు. బంగారు తెలంగాణ కోసం అందరం కలిసి పాటుపడదామని తెలిపారు. 29న 'దీక్షా దివాస్' పేరుతో తెలంగాణ వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టాలని పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. అలాగే నవంబర్ 30 నుంచి 'పల్లెబాట' కార్యక్రమం చేపట్టనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఈ పల్లెబాట కార్యక్రమం 40 రోజుల పాటు కొనసాగుతుందని ఆయన తెలిపారు. డిసెంబర్ 9న లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నల్లజెండాలతో నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more