వైఎస్ జగన్ పార్టీ .. కాంగ్రెస్ లో కలుస్తుందా? లేదా అనుమానం రాష్ట్ర ప్రజల్లో .. సిగ్నల్ అందని ..సెల్ ఫోన్ల.. మనసు కొట్టుకుంటుంది. అయితే ఇలాంటి వార్తలను ఆపార్టీ జూనియర్ నాయకులు ఖడిస్తున్నారు. కానీ ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మాత్రం .. అసలు విషయం మీడియా సాక్షిగా బయటపెట్టారు. ఆమె ఉండబట్టలేక మనసులోని మాటను బయటపెట్టి అది కాస్తా బూమెరాంగ్ కావడంతో.. చేతులు కాలిన విజయలక్ష్మి ఆ తర్వాత అకులు పట్టుకున్నా ఫలితం లేకపోయింది. నిజం బయటకు వెల్లువలా తన్నుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీ నం విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ కథనాలు టీవీలో ప్రసారం అవుతుండగానే ఆ పార్టీ నేత జూపూడి ప్రభాకరరావు హడావుడిగా ఓ ప్రకటన జారీ చేసి తమ నాయకురాలు అలా అనలేదని, ఆమె వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని రొటీన్గా ఓ ఖండన ఇచ్చేశారు.
అయితే పీటీఐ ఇంటర్వ్యూ ఆడియోలు యూట్యూబ్లో ప్రత్యక్షమయ్యాయి. వైసీపీని భవిష్యత్తులో కాంగ్రెస్లో విలీనం చేస్తారా అని పీటీఐ విలేకరి ప్రశ్నించగా.. కాలమే నిర్ణయిస్తుందని విజయలక్ష్మి స్పష్టంగా చెప్పారు. అంటే విలీన వార్తలను తోసి పుచ్చడం లేదు కదా.. అని అడిగినా కూడా దానికి కాలమే నిర్ణయిస్తున్నట్టు ఆమె సమాధానం ఉంది. విజయలక్ష్మి ఆడియో బయట పడటంతో వైసీపీ నేతలకు గొంతు లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. సమీప భవిష్యత్లోనే జగన్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అవుతుందన్న వార్తలకు బలం చేకూర్చేలా ఈ ప్రకటన ఉండడంతో ఏం చేయాలో తెలియక ఆ పార్టీ నేతలు తల పట్టుకున్నారు. మీడియాలో కథనాలు వస్తే ఖండించి బయట పడాలి.. కానీ ఆ డియో కూడా వినిపిస్తే ఏం చేయాలో అని మల్లగుల్లాలు పడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more